శ్రీశైలం ఆలయం వీఆర్వోపై హత్యాయత్నం: కళ్లల్లో కారం కొట్టి కత్తులతో దాడి

  • Published By: veegamteam ,Published On : March 12, 2019 / 05:01 AM IST
శ్రీశైలం ఆలయం వీఆర్వోపై హత్యాయత్నం: కళ్లల్లో కారం కొట్టి కత్తులతో దాడి

Updated On : March 12, 2019 / 5:01 AM IST

కర్నూలు : శ్రీశ్రైలం ఆలయ వీఆర్వో  శ్రీనివాసరావుపై హత్యాయత్నం జరిగింది. కత్తులతో దాడి చేయంటంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. సోమవారం (మార్చి 11) సాయంత్రం ఈఓ కలిసి అక్కడ నుంచి బయటకు వస్తున్న సమయంలో కళ్లల్లో కారంచల్లి..కత్తితో దాడిచేసినట్లుగా తెలుస్తోంది. శ్రీనివాస్‌పై దాడికి పాల్పడిన యువకుడ్ని స్థానికులు వెంటాడి పట్టుకుని, ఆలయ సెక్యూరిటీ ద్వారా పోలీసులకు అప్పగించారు. తీవ్రంగా గాయపడిన పీఆర్వోను హాస్పిటల్‌కు తరలించి చికిత్సనందిస్తున్నారు.  
 

స్థానిక వ్యక్తి ప్రోద్బలంతోనే శ్రీనివాస్‌పై దాడిచేసినట్టు నిందితుడు పోలీసుల విచారణలో వెల్లడించినట్లుగా సమాచారం. దీనిపై కేసు నమోదుచేసిన పోలీసులు మిగతా వారి కోసం గాలిస్తున్నారు.