సామాన్యులకూ రూ.200కు శ్రీవారి కళ్యాణ లడ్డూ
తిరుమల శ్రీవారి కళ్యాణోత్సవం లడ్డూలను సామాన్యులకూ టీటీడీ అందుబాటులోకి తీసుకొచ్చింది.

తిరుమల శ్రీవారి కళ్యాణోత్సవం లడ్డూలను సామాన్యులకూ టీటీడీ అందుబాటులోకి తీసుకొచ్చింది.
తిరుమల శ్రీవారి లడ్డూ అంటే.. భక్తులకు ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తిరుమల వెళ్తే చాలు.. స్వామి వారిని దర్శించుకున్నాక.. లడ్డూల కోసం ఎంత వెయిట్ చేస్తారో.. ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎందుకంటే స్వామి వారి లడ్డూకు ఉన్న ప్రత్యేకత అది. ఇక శ్రీవారి కళ్యాణ లడ్డూ గురించి చెప్పక్కర్లేదు. ఈ లడ్డూ అందరికీ లభ్యమయ్యేది కాదు.
కేవలం స్వామి వారికి కళ్యాణ చేయించిన భక్తులకు మాత్రమే లభిస్తుంది. అయితే ఈ కళ్యాణ టిక్కెట్లు దొరకడమన్నది అంత సులువు కాదు. దీంతో ఈ కళ్యాణ లడ్డూ సామాన్య భక్తులకు అసలు దొరకని పరిస్థితి. తిరుమల శ్రీవారి కళ్యాణోత్సవం లడ్డూలను సామాన్యులకూ టీటీడీ అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఎలాంటి సిఫార్సు లేఖలు అవసరం లేకుండా ప్రత్యేక కౌంటర్ల ద్వారా విక్రయిస్తోంది. లడ్డూ ప్రధాన విక్రయ కేంద్రంలో రెండు కేంద్రాలను ఏర్పాటు చేసి విక్రయాలను ప్రారంభించింది. చిన్న లడ్డూతో పాటు కళ్యాణోత్సవ లడ్డూను విక్రయిస్తున్నారు. దీని ధరను రూ.200గా నిర్ణయించారు. అందరికీ పెద్ద లడ్డూలను అందిస్తుండటంతో సాధారణ భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.