3నెలల కన్నబిడ్డను అమ్మి..ఆ డబ్బుతో బైక్..ఫోన్ కొని జల్సాలు

  • Published By: nagamani ,Published On : August 31, 2020 / 12:40 PM IST
3నెలల కన్నబిడ్డను అమ్మి..ఆ డబ్బుతో బైక్..ఫోన్ కొని జల్సాలు

మూడు నెలల వయసున్న కన్న కూతుర్ని పాలు తాగే పసికందు అనికూడా చూడకుండా కన్నతండ్రే అమ్మేశాడు. పసిబిడ్డను అమ్మిన రూ.1లక్షతో ఓ బైక్, ఓ స్మార్ట్‌ఫోన్ కొన్నాడు. బండి మీద తిరుగుతూ స్మార్ట్ ఫోన్ తో ఎంజాయ్ చేస్తున్నాడు ఆ కర్కోటక తండ్రి. కర్ణాటకలోని చిక్కబళ్లాపూర్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది.



టినకల్ గ్రామంలో చెందిన నిందితుడు వ్యవసాయ కూలీగా పనిచేస్తున్న వ్యక్తి బిడ్డను అమ్మేసిన ఆ లక్ష రూపాయలతో రూ.50వేలు పెట్టి ఓ బైక్..రూ.15 వేలు పెట్టి ఓ స్మార్ట్ ఫోన్ కొన్నాడు. ఉన్నట్టుండి నిందితుడి వద్ద స్మార్ట్‌ఫోన్, బైక్ రావడంతో స్థానికులకు అతని మీద అనుమానం కలిగింది. వెంటనే వారంతా అధికారులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన అధికారులు అతని నిర్వాకాన్ని బట్ట బయలు చేశారు.
https://10tv.in/picture-of-dead-chinese-soldiers-grave-gives-first-evidence/
కన్నబిడ్డను అమ్మేస్తుండగా తల్లి ఏం చేసింది? భర్తను అడ్డుకోలేదా? బిడ్డను అమ్మిన విషయంలో తల్లికి కూడా పాత్ర ఉందా? ఆమె అనుమతితోనే బిడ్డను అమ్మేశాడా..అన్న కోణంలో నిందితుడి భార్యను అదుపులోకి తీసుకున్నారు. అయితే భర్త బెదిరింపులకు లొంగిపోయే తాను కన్నబిడ్డను అమ్మేందుకు అంగీకరించినట్టు ఆమె విచారణలో తెలిపింది. పాపను తిరిగి తనకు అప్పగించాలని కూడా అధికారులను కోరింది. కాగా.. నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉండగా.. పోలీసులు అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.



విచారణలో భాగంగా..ఆ బిడ్డను మామచనహళ్లి గ్రామానికి చెందిన దంపతులకు విక్రయించినట్లుగా నిర్ధారణ కావటంతో..మహిళా శిశుసంక్షేమ శాఖ అధికారులు ఆ చిన్నారిని వారి నుంచి స్వాధీనం చేసుకుని మాతా శిశు వెల్ఫేర్ కు తరలించారు. నిజంగానే ఆమె భర్తకు భయపడే బిడ్డు అప్పగించిందా? లేదా అనేది తండ్రి పట్టుబడిన తరువాత విచారించి బడ్డను అప్పగిస్తామని తెలిపారు.