నాలాలో బాలిక పడలేదు.. యువకుడు తీసుకెళ్లాడు – స్థానికులు
girl goes missing : నేరెడ్ మెట్ లో కాకతీయనగర్ లో సుమేధ మిస్సింగ్ కేసులో న్యూ ట్విస్ట్ చోటు చేసుకుంది. ముసుగు ధరించిన ఓ వ్యక్తి సుమేధతో ఉండడం చూశానని స్థానికంగా ఉన్న వారు వెల్లడించడం కలకలం రేపుతోంది.
ఎక్కడకు వెళుతున్నావని తాను అడిగినట్లు, ఇక్కడ వరకు వెళ్లి వస్తానని సుమేధ (11) వెల్లడించిందని చందన తెలిపింది. ఈ విషయాన్ని వారి తల్లిదండ్రులకు చెప్పినట్లు తెలిపారు.
ఆ యువకుడితో ఎందుకు వెళ్లిందో తెలియడం లేదని, మాయమాటలు చెప్పి తీసుకెళ్లి ఉండవచ్చునని స్థానికంగా నివాసం ఉంటున్న ఓ వ్యక్తి అభిప్రాయం వ్యక్తం చేశారు. పరిచయం లేకపోతే..సుమేధ వెళ్లదని, తెలిసిన వారే ఈ పని చేసి ఉంటారని అనుకుంటున్నట్లు చెప్పారు.
బాలిక చాలా తెలివైందని, ఎక్కడకైనా వెళితే…ఫోన్ చేసే తెలివి ఉందన్నారు. ఇప్పటి వరకు నాలాలో సుమేధ పడి ఉంటుందని అందరూ భావించారు. కానీ..స్థానికంగా ఉన్న వారు అనుమానాలు వ్యక్తం చేస్తుండడంతో అందరిలో ఉత్కంఠ నెలకొంది.
→ కాకతీయనగర్కు చెందిన సుమేధ 11 సంవత్సరాల బాలిక
→ 2020, సెప్టెంబర్ 17 గురువారం సాయంత్రం సైకిల్పై బయటకు వెళ్లింది.
→ కాకతీయనగర్లో సీసీ టీవీ ఫుటేజ్ పరిశీలించారు. సుమేధ సైకిల్పై వెళ్తున్న దృశ్యాలు కనిపించాయి.
→ కాకతీయనగర్ నాలా వద్ద సుమేధ వెళ్లిన సైకిల్ కనిపించింది. → నాలాలో పడిపోయింటుందని అనుమానిస్తున్నారు.
→ జీహెచ్ఎంసీ డిజాస్టర్ మేనేజ్మెంట్ సాయంతో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు పోలీసులు.
→ చిన్నారి ఎంతకూ ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేపట్టారు.
→ శుక్రవారం ఉదయం 7 గంటల నుంచి పోలీసులు చిన్నారి
→ ఆచూకీ కోసం సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు.
→ ఆగంతకుడు తీసుకెళ్లాడా ? నాలాలో పడిపోయిందా ? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.