Telangana : నెలకు 250 యూనిట్ల విద్యుత్ ఫ్రీ..వారికి మాత్రమే

తెలంగాణలోని రజకులు, నాయీ బ్రాహ్మణులకు గుడ్‌న్యూస్ చెప్పారు సీఎం కేసీఆర్. అన్ని సెలూన్ షాపులు, లాండ్రీ షాపులు, దోభీఘాట్లకు నెలకు 250 యూనిట్ల విద్యుత్‌ను ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించింది తెలంగాణ ప్రభుత్వం.

Telangana : నెలకు 250 యూనిట్ల విద్యుత్ ఫ్రీ..వారికి మాత్రమే

Current

free power : తెలంగాణలోని రజకులు, నాయీ బ్రాహ్మణులకు గుడ్‌న్యూస్ చెప్పారు సీఎం కేసీఆర్. అన్ని సెలూన్ షాపులు, లాండ్రీ షాపులు, దోభీఘాట్లకు నెలకు 250 యూనిట్ల విద్యుత్‌ను ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించింది తెలంగాణ ప్రభుత్వం. రాష్ట్రంలోని సంఘాలు, నాయీ బ్రాహ్మణ సంఘాలు ప్రభుత్వానికి ఇప్పటికే చేసిన విజ్ఞప్తులు చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు సీఎం కేసీఆర్. ఇందుకు సంబంధించిన జీఓను బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ బుర్ర వెంకటేశం విడుదల చేశారు. ఈ ఉచిత విద్యుత్తు సరఫరా ఏప్రిల్ 1 నుంచే అమల్లోకి రానుంది.

అత్యంత బలహీన వర్గాల అభ్యున్నతే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని వారి సంక్షేమం కోసం ఇప్పటికే అనేకల పథకాలను అమలు పరుస్తున్నామని తెలిపారు సీఎం కేసీఆర్. ఈ నిర్ణయం ద్వారా గ్రామ స్థాయి నుంచి జీహెచ్ఎంసీ దాకా ఉన్న కటింగు షాపులకు, లాండ్రీ షాపులకు, దోభీ ఘాట్లకు 250 యూనిట్ల వరకు నాణ్యమైన కరెంటు ఉచితంగా అందుబాటులోకి రానుందని చెప్పారాయన. తద్వారా, తర తరాలుగా కుల వృత్తిని ఆధారంగా చేసుకుని జీవనం కొనసాగిస్తున్న కుటుంబాలకు లబ్ధి చేకూరనుందన్నారు సీఎం కేసీఆర్.

కాగా, సాంకేతికాభివృద్ది చెందిన పలు రకాల యంత్రాలు రజకులు, నాయీ బ్రాహ్మణులకు ఉపయోగపడుతున్నాయ్‌. దీంతో.. ప్రభుత్వం తీసుకున్న ఉచిత విద్యుత్తు నిర్ణయం ద్వారా వృత్తి దారులకు శారీరక శ్రమ తగ్గి, ఆర్ధిక వెసులు బాటు కూడా కలగనుంది. సీఎం కేసీఆర్ నిర్ణయంపై తెలంగాణలోని రజక సంఘాలు, నాయీ బ్రాహ్మణ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి.