YSR Sunna Vaddi : రైతుల ఖాతాల్లోకి రూ.128కోట్లు.. సున్నా వడ్డీ రాయితీని జమ చేసిన సీఎం జగన్

రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని ఏపీ సీఎం జగన్ అన్నారు. ఇప్పటివరకు 6 లక్షల మందికి పైగా రైతులకు వడ్డీ రాయితీని అందించామని చెప్పారు. గత రబీ సీజన్ లో లక్ష రూపాయల వరకు పంట రుణాలు తీసుకుని, ఏడాదిలోపు తిరిగి చెల్లించిన 6లక్షల 27వేల 906 మంది రైతులకు వడ్డీ రాయితీని అందించామని తెలిపారు. ఈరోజు(ఏప్రిల్ 20,2021) జగన్ తన క్యాంపు కార్యాలయం నుంచి రూ. 128.47 కోట్లను బటన్ నొక్కి బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు.

YSR Sunna Vaddi : రైతుల ఖాతాల్లోకి రూ.128కోట్లు.. సున్నా వడ్డీ రాయితీని జమ చేసిన సీఎం జగన్

Ysr Sunna Vaddi

YSR Sunna Vaddi : రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని ఏపీ సీఎం జగన్ అన్నారు. ఇప్పటివరకు 6 లక్షల మందికి పైగా రైతులకు వడ్డీ రాయితీని అందించామని చెప్పారు. గత రబీ సీజన్ లో లక్ష రూపాయల వరకు పంట రుణాలు తీసుకుని, ఏడాదిలోపు తిరిగి చెల్లించిన 6లక్షల 27వేల 906 మంది రైతులకు వడ్డీ రాయితీని అందించామని తెలిపారు. ఈరోజు(ఏప్రిల్ 20,2021) జగన్ తన క్యాంపు కార్యాలయం నుంచి రూ. 128.47 కోట్లను బటన్ నొక్కి బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు.

ప్రపంచంలో 60 శాతం మంది వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారని సీఎం జగన్ చెప్పారు. వైసీపీ ప్రభుత్వానికి రైతులు, రైతు కూలీలు చాలా ముఖ్యమని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలోని బకాయిలను కూడా చెల్లించామని వివరించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎంతో మేలు జరుగుతోందన్నారు. వచ్చే(మే) నెలలో మరో విడత రైతు భరోసా సాయాన్ని అందిస్తామని సీఎం చెప్పారు.

సున్నా వడ్డీ పథకంతో రైతులకు చేయూతనిస్తున్న ఏపీ ప్రభుత్వం.. ఇవాళ రెండో ఏడాది వడ్డీ రాయితీ జమ చేసింది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం గతేడాది(2020) సున్నా వడ్డీ పంట రుణం ప్రారంభించారు సీఎం జగన్‌. లక్షలోపు రుణాలు తీసుకుని ఏడాదిలో చెల్లించిన వారికి ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. 2018-19 ఏడాదిలో లక్షలోపు రుణాలు తీసుకున్న రైతులకు 11 వందల 32 కోట్ల రూపాయల వడ్డీ రాయితీ విడుదల చేసింది ప్రభుత్వం. 2019-20లో రుణాలు తీసుకున్న 6 లక్షల 27 వేల మంది రైతులకు ఇవాళ 128 కోట్ల వడ్డీ రాయితీ ఇచ్చింది.

ఈ-క్రాప్‌లో నమోదు చేసుకున్న రైతులకు మాత్రమే సున్నా వడ్డీ పంట రుణాల పథకం వర్తింపజేయాలని తొలుత నిర్ణయించగా.. ఆన్‌లైన్‌లో 2 లక్షల 50 వేల మంది రైతులు మాత్రమే నమోదు చేసుకున్నారు. మిగిలిన రైతులలో బ్యాంకర్లు అర్హులుగా గుర్తించిన వారికి ప్రభుత్వం వడ్డీ రాయితీ చెల్లిస్తోంది. మొత్తం 6 లక్షల 27 వేల మంది రైతుల ఖాతాల్లోకి.. సీఎం జగన్‌ ఆన్‌లైన్‌ ద్వారా డబ్బుల్ని జమ చేశారు.

రైతులు అప్పుల ఊబిలో చిక్కుకోకుండా వడ్డీ లేని రుణాలు ఇస్తామని ఎన్నికల ముందు ఇచ్చిన మాట మేరకు.. అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం జగన్‌.. వైఎస్సార్‌ సున్నా వడ్డీ పంట రుణాల పథకం అమలు చేస్తున్నారు. లక్ష రూపాయల వరకు పంట రుణాలు తీసుకుని, ఏడాది లోపు ఆ రుణం తిరిగి చెల్లించిన రైతులందరికీ సున్నా వడ్డీ పంట రుణాల పథకం వర్తింపజేస్తున్నారు.

ఇప్పటివరకు రైతులకు రూ.1,132.54 కోట్ల వడ్డీ రాయితీని ప్రభుత్వం అందజేసింది. ఇప్పుడు రెండో ఏడాది అంటే 2019-20 రబీ సీజన్‌లో లక్ష రూపాయల వరకు పంట రుణాలు తీసుకుని ఏడాదిలోపు తిరిగి చెల్లించిన 6లక్షల 27వేల 906 మంది రైతులకు వడ్డీ రాయితీ కింద రూ.128.47 కోట్లు చెల్లించింది. సీఎం జగన్‌ మంగళవారం(ఏప్రిల్ 20,2021) తన క్యాంపు కార్యాలయం నుంచి కంప్యూటర్‌ బటన్‌ నొక్కి ఈ మొత్తాన్ని రైతుల బ్యాంకు ఖాతాల్లో జమచేశారు.

గత ప్రభుత్వం 2014-15 నుంచి 2018-19 వరకు పెట్టిన రూ.1,180 కోట్లు వడ్డీ లేని రుణాల బకాయిలను కూడా జగన్ ప్రభుత్వం విడుదల చేస్తోంది. ఆ మేరకు ఇప్పటివరకు అర్హులైన రైతులకు రూ.850.68 కోట్ల వడ్డీ రాయితీని ప్రభుత్వం చెల్లించింది. సున్నా వడ్డీ పంట రుణాల పథకం ద్వారా 2019 ఖరీఫ్‌కి సంబంధించి 14.27 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.281.86 కోట్లు జమ చేసింది. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతన్నల సంక్షేమమే ధ్యేయంగా ఇప్పటివరకు వివిధ పథకాల ద్వారా అన్నదాతలకు రూ.61వేల 400 కోట్ల సాయం చేసింది.