ఏపీలో కలకలం : మంత్రి బొత్సకు సీబీఐ నోటీసులు
ఫోక్స్ వ్యాగన్ కేసులో సాక్షిగా ఉన్న ఏపీ మంత్రి బొత్సా సత్యనారాయణకు సమన్లు జారీ చేసింది సీబీఐ. హైదరాబాద్ సీబీఐ కోర్టుకు 2019 సెప్టెంబర్ 12వ తేదీన హాజరు కావాలంటూ సీబీఐ నోటీసులు ఇచ్చింది. ఉమ్మడి ఏపీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎం గా ఉన్న సమయంలో పరిశ్రమల శాఖ మంత్రిగా బొత్స సత్యనారాయణ ఉన్న సమయంలో ఫోక్స్ వ్యాగన్ కేసు చోటు చేసుకుంది. ఆ కేసులో బొత్స సాక్షి గా ఉన్నారు.
2005తో భారీ పరిశ్రమల శాఖామంత్రిగా రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో బొత్స ఉన్నారు. 2005లో ఫోక్స్ వ్యాగన్ కేసు నమోదవగా.. అప్పట్లో భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న బొత్సపైన కూడా అనేక ఆరోపణలు వచ్చాయి. ఫోక్స్ వ్యాగన్ కంపెనీని హైదరాబాద్ నుంచీ వైజాగ్కి తరలించాలనే అంశంపై బొత్సతో సహా అప్పటి ప్రభుత్వంలోని పెద్దలకు పెద్ద ఎత్తున ముడుపులు అందాయయంటూ ఆరోపణలు ఉన్నాయి.
దీనిపై అప్పటి రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ దర్యాప్తుకి ఆదేశించింది. విచారణ జరుగుతున్న సమయంలో ఏడుగురిని నిందితులుగా చేర్చగా 59మంది సాక్షులను చేర్చింది. ఇప్పటికే 3వేల పేజీల ఛార్జిషీట్ను సీబీఐ దాఖలు చేయగా.. దాదాపు రూ.7 కోట్ల వరకూ రికవరీ అయ్యాయి. ఇంకా రూ.5కోట్ల 65లక్షలు రికవరీ కావలసి ఉంది.
వశిష్ట వాహన అనే సూట్కేసు కంపెనీని సృష్టించి పెట్టుబడులను ఆ నకిలీ కంపెనీకి మళ్లించడం ద్వారా పెద్ద కుట్ర జరిగిందని సీబీఐ ఛార్జిషీట్లో వెల్లడించింది. ఈ కేసులో ఇప్పుటివరకు ఇద్దరు నిందితులు మాత్రమే హాజరవుతున్నారు. వాళ్లు వశిష్ట వాహన కంపెనీకి డైరెక్టర్లుగా వ్యక్తులు. ఆ ఇద్దరిలో జైన్ అనే వ్యక్తి మెయిన్గా ఉండగా.. బొత్స చెప్పే సాక్షాలను బట్టి సీబీఐ కోర్టు తగిన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.