నంది అవార్డులు ఇవ్వండి: జగన్ ప్రభుత్వాన్ని కోరిన సీనియర్ నటులు

  • Published By: vamsi ,Published On : September 3, 2019 / 10:57 AM IST
నంది అవార్డులు ఇవ్వండి: జగన్ ప్రభుత్వాన్ని కోరిన సీనియర్ నటులు

జయసుధకు అభినవ మయూరి బిరుదును ఇస్తున్నట్లు ప్రకటించారు కళాబంధు టీ  సుబ్బిరామిరెడ్డి. ప్రతీ సంవత్సరం ప్రతిష్టాత్మకంగా సీనియర్ నటులకు ఇస్తున్నటువంటి బిరుదు ప్రధానం గురించి పాత్రికేయ సమావేశం నిర్వహించి ప్రకటించారు టీ  సుబ్బిరామిరెడ్డి.

ఈ సంధర్భంగా మాట్లాడిన సీనియర్ నటులు మురళీ మోహన్.. ఒకప్పుడు ప్రతీ సంవత్సరం అవార్డుల పండుగలు ఉండేవి అని, ఇటీవలకాలంలో అవార్డుల ప్రధానోత్సవం కార్యక్రమాలు తగ్గిపోయాయని అన్నారు. అభినవ మయూరి బిరుదు అందుకోబోతున్న జయసుధను అభినందించిన మురళీ మోహన్ ఆమెతో కలిసి పనిచేసిన సినిమాలను గుర్తుచేసుకున్నారు. ఆమె జీవితంలో జ్యోతి సినిమాకు ఓ ప్రత్యేకత ఉంటుందని ఆయన అన్నారు.

జయసుధలో ఉన్న గొప్పతనం ఏంటంటే? ఆ క్యారెక్టర్ లోకి వెళ్లిపోతుందని, ప్రతీ ఒక్కరితో ఫ్రెండ్లీగా ఉంటుందని, జయసుధ గారికి బిరుదు ఇవ్వడం ఆనందంగా ఉందని ఆయన అన్నారు. రాబోయే రోజుల్లో ఇంకా ఎంతోమందికి సుబ్బిరామిరెడ్డి గారు ఇటువంటి అవార్డులు ఇవ్వాలని మురళీమోహన్ అన్నారు.

అలాగే ప్రభుత్వం తరుపున అవార్డులు ఇవ్వడం తగ్గిపోయిందాని, గత ప్రభుత్వం కానీ, ఇప్పటి ప్రభుత్వం కానీ ఆ దిశగా అడుగులు వెయ్యట్లేదని, ప్రభుత్వం ఇచ్చే అవార్డులు అంటే ఓ గౌరవం అని అందరూ భావిస్తారని, ఇప్పటి జగన్ ప్రభుత్వం అయినా గత నాలుగు ఏళ్ల నుంచి ఇవ్వవలసిన నంది అవార్డులను ఇస్తే బాగుంటుందని మురళీ మోహన్ అభిప్రాయపడ్డారు. సీనియర్ నటి జయసుధ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.