Varshini: సమంత శాకుంతలంలో వర్షిణీ సౌందరాజన్
పాన్ ఇండియా కథాంశంతో సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న శాకుంతలం సినిమాలో నటించే అవకాశం కొట్టేసింది ప్రముఖ యాంకర్ వర్షిణి సౌందరాజన్.
Varshini: పాన్ ఇండియా కథాంశంతో సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న శాకుంతలం సినిమాలో నటించే అవకాశం కొట్టేసింది ప్రముఖ యాంకర్ వర్షిణి సౌందరాజన్. జబర్దస్త్, ఢీ, పటాస్ వంటి టెలివిజన్ ప్రోగ్రామ్స్ లో నటించి క్రేజ్ క్రియేట్ చేసుకున్న ఈ అమ్మడు వరుసగా సినిమాల్లో నటిస్తోంది. ఈ క్రమంలోనే గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్ లో ప్లేస్ దక్కించుకుంది.
ఈ బ్యూటీ మరోవైపు రొమాంటిక్ డ్రామా నేపథ్యంలో రాబోతున్న మళ్లీ మొదలైంది చిత్రంలో సుమంత్ భార్యగా నటిస్తోంది. రవితేజ, ప్రియమణి నటించిన శంబో శివ శంబో చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. పీరియాడికల్ మూవీగా గుణశేఖర్ తెరకెక్కిస్తున్న శాకుంతలం చిత్రంలో దేవ్ మోహన్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. తెలుగు, హిందీ, తమిళ భాషలలో ఈ సినిమా తెరకెక్కుతోంది.