MS Dhoni: ధోనీ అభిమానులకు గుడ్ న్యూస్.. చెన్నై క్లారిటీ!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ -2021 టైటిల్ చెన్నై సూపర్ కింగ్స్ గెలుచుకుంది.
MS Dhoni: ఇండియన్ ప్రీమియర్ లీగ్ -2021 టైటిల్ చెన్నై సూపర్ కింగ్స్ గెలుచుకుంది. మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలో చెన్నైకి ఇది నాలుగో టైటిల్. కోల్కతా నైట్ రైడర్స్ను ఓడించి చెన్నై ఛాంపియన్గా నిలిచింది. మహేంద్ర సింగ్ ధోనీ నేతృత్వంలో CSK 9వ సారి ఐపీఎల్ ఫైనల్కు చేరుకుంది. అందులో నాలుగు సార్లు టైటిల్ నెగ్గింది.
అయితే, వచ్చే ఐపీఎల్ నుంచి ధోనీ చెన్నై జట్టుకు కెప్టెన్గా ఉండడు అంటూ వార్తలు వస్తుండగా.. క్లారిటీ ఇచ్చింది చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం. మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్(CSK) ఈ ఏడాది నాలుగోసారి ఐపీఎల్ 2021 టైటిల్ గెలుచుకోగా.. IPL 2021 తర్వాత ధోనీ రిటైర్ అవుతాడని ఊహాగానాలు వినిపించాయి.
వచ్చే ఏడాది ఐపీఎల్ మెగా వేలం జరగబోతుందని, ‘CSK తదుపరి వేలంలో MS ధోనీని నిలుపుకునేందుకు కార్డును ఉపయోగిస్తాం’ అని సీఎస్కే యాజమాన్యం స్పష్టం చేసింది. వాస్తవానికి ప్రతి జట్టుకు ముగ్గురు ఆటగాళ్లను నిలుపుకునే అవకాశం ఉంటుంది. CSK మాత్రం ధోనీని నిలుపుకుంటుంది అని ప్రకటించింది.
The first retention card at the auction will be used for MS Dhoni: CSK official
Read @ANI |https://t.co/wFTzUsOAnX#MSDhoni pic.twitter.com/xr3PIAMYy3
— ANI Digital (@ani_digital) October 17, 2021