Siliguri Corridor : సిలిగురి కారిడార్ పై చైనా కన్ను..చుంబీ వ్యాలీలో పెద్ద ఎత్తున రోడ్ల నిర్మాణం!
భారత్కు అత్యంత వ్యూహాత్మక ప్రాంతమైన సిలిగురి కారిడార్(చికెన్స్ నెక్ గా కూడా పిలుస్తారు)పై తాజాగా డ్రాగన్ కన్నుపడింది. సిలిగురి కారిడార్కు అత్యంత దగ్గరగా ఉన్న భూటాన్ భూభాగంలోని
Siliguri Corridor భారత్కు అత్యంత వ్యూహాత్మక ప్రాంతమైన సిలిగురి కారిడార్(చికెన్స్ నెక్ గా కూడా పిలుస్తారు)పై తాజాగా డ్రాగన్ కన్నుపడింది. సిలిగురి కారిడార్కు అత్యంత దగ్గరగా ఉన్న భూటాన్ భూభాగంలోని చుంబి లోయలో రోడ్ల నిర్మాణాలు వంటి మౌలిక సదుపాయాలను చైనా వేగవంతం చేసింది. భూటాన్ భూభాగంలో చైనా చర్యలు భారత్కు ప్రమాదకరంగా మారుతున్నాయి.
భూటాన్-చైనా మధ్య సరిహద్దు వివాదాలను మూడు అంచెల్లో పరిష్కరించుకోవడానికి ఇటీవల ఓ ఒప్పందం కుదిరింది. ఒప్పంద వివరాలు బహిర్గతం కాలేదు. ఈ ఒప్పందాన్ని మోదీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బగా చైనాకు చెందిన సీజీటీఎస్ పేర్కొంది. చైనా మీడియాలోని ఇతర వార్తాసంస్థల్లో కూడా ఇదే విధంగా కథనాలు వెలువడటం గమనార్హం. అయితే ఈ ఒప్పందంలో భాగంగా చుంబీ లోయలో చైనా ప్రత్యామ్నాయ మార్గాన్ని నిర్మిస్తోందని తాజాగా ఓ ఉన్నతాధికారి తెలిపారు. భూటాన్ భూభాగం గుండా రహదారులను నిర్మించడం ద్వారా సరిహద్దుల్లో చైనా తన పట్టుని పెంచుకునేందుకు మరింత ప్రయత్నిస్తోందని సదరు అధికారి తెలిపారు.
కాగా, ఈశాన్య భారత్ లోని 8 రాష్ట్రాలకు వెళ్లేందుకు సిలిగురి కారిడార్ కీలకం. రైలు, రోడ్డు మార్గాలు ఈ ప్రదేశం(సిలిగురి కారిడార్) నుంచే వెళ్తాయి. దీంతోపాటు కీలక పైప్లైన్లు, కమ్యూనికేషన్ కేబుల్స్ కు కూడా ఇదే మార్గం. పశ్చిమ బంగాల్ లో ఉన్న ఈ ప్రాంతంలో కొంత భాగం కేవలం 22 కిలోమీటర్ల వెడల్పు ఉంది. నేపాల్ , భూటాన్, బంగ్లాదేశ్కు అత్యంత సమీపంలో సిలిగురి కారిడార్ ఉంది. చైనాకు చెందిన చుంబీ లోయ కూడా దీనికి అత్యంత సమీపంలోనే ఉంది. ఈ ప్రదేశంపై చైనా దాడి చేసి భారత్ నుంచి ఈశాన్య రాష్ట్రాలను వేరుచేసే ప్రమాదం ఉందని సైనిక వ్యూహకర్తలు కొన్ని దశాబ్దాలుగా ఆందోళన చెందుతున్నారు. ఇదే జరిగితే ఈశాన్య ప్రాంతాల్లోని సైనిక దళాలకు సరఫరాలు కష్టమైపోతాయి.
చికెన్స్ నెక్ ఎంతో సున్నితమైందని ఈస్టర్న్ కమాండ్ లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ పాండే ఇటీవల వ్యాఖ్యానించారు. చుంబీ లోయవైపు ఉన్న భూటాన్ భూమి చైనా చేతిలోకి వెళితే డోక్లాం ట్రై జంక్షన్ వద్ద పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ పట్టు పెరిగిపోతుందన్నారు. దీంతో చైనా చుంబీ లోయలో శతఘ్నులు, యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ క్షిపణులు, యుద్ధవిమానాలను సిలిగుడి లక్ష్యంగా మోహరించే ప్రమాదం ఉందన్నారు. ఇప్పటికే చైనా అండదండలతో ఈశాన్య రాష్ట్రాల్లో తీవ్రవాదం నెలకొందన్నారు. ఈ క్రమంలో సిలిగుడి ప్రాంతంలో తీవ్రవాదం, వేర్పాటు వాద భావజాలం పెరిగితే భారత్కు ఇబ్బందులు తప్పవని లెఫ్టినెంట్ జనరల్ పాండే గత నెలలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ జాతీయ ప్రయోజనాల దృష్ట్యా సైన్యం నేతృత్వంలో జాయింట్ కోఆర్డినేషన్ సెంటర్ ను ఏర్పాటు చేశారు. ఇది అక్కడ సీఏపీఎఫ్ వంటి మిగిలిన భద్రతా దళాలు, పొరుగు రాష్ట్రాలతో సమన్వయం చేసుకొంటూ పనిచేస్తుందని లెఫ్టినెంట్ జనరల్ పాండే తెలిపారు.
మరోవైపు,రెండు నెలల క్రితం చుంబీలోయలోని ఫరిడోజాంగ్, యాతంగ్ వద్ద చైనా ఆర్మీ దాదాపు నెలరోజుల పాటు నియామకాలు చేపట్టింది. ప్రతి ఇంటి నుంచి 18-40 ఏళ్ల మధ్య వయస్సు వారిని పీఎల్ఏ(పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ-చైనా ఆర్మీ) దళాల్లోకి తీసుకోవాలని నిర్ణయించిన డ్రాగన్ ఇందులో భాగంగా 400 మంది టిబెట్ వాసులను సైనిక శిక్షణకు ఎంపిక చేసినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయి. ఎంపికైన వారికి టిబెట్ లోని లాసాలో ఏడాదిపాటు శిక్షణ ఇవ్వనుంది. ఆ తర్వాత వీరిని భారత్, చైనా సరిహద్దుల్లో నియమించనుంది. ఈ ప్రాంతాల్లో భౌగోళిక సవాళ్లను ఎదుర్కోవడానికే ఇలా చేస్తోంది.
ఈ ఏడాది జులైలో కూడా లడఖ్ కు సమీపంలోని నంగారిలోని షిక్వాన్హేలో చైనా ఆర్మీ నియామకాలు చేపట్టింది. భారత్కు చెందిన స్పెషల్ ఫ్రాంటియర్ ఫోర్స్(టిబెట్ వాసులతో ఏర్పాటు చేసిన దళం) గతేడాది కైలాష్ రేంజిని ఈ స్పెషల్ ఫ్రాంటియర్ ఫోర్స్ ఆక్రమించిన తర్వాత చైనా కూడా ఇలాంటి ఒక దళాన్ని ఏర్పాటు చేయాలని చైనా ఫ్లాన్ చేస్తోంది.
ALSO READ మయన్మార్ మీదుగా హిందూ మహాసముద్రంలోకి చైనా..కొత్త రైల్వే లైన్ ప్రారంభం
ALSO READ అరుణాచల్ ప్రదేశ్ లో 100 ఇళ్ల చైనా గ్రామం..యూఎస్ రిపోర్ట్
ALSO READ చైనా పన్నాగం..సరిహద్దులో బుల్లెట్ ట్రైన్ ప్రారంభం