DJ Tillu : ట్రైలర్ చూసి ముగ్గురు నిర్మాతలు సినిమా చేద్దామన్నారు : DJ టిల్లు డైరెక్టర్
‘డిజె టిల్లు’ డైరెక్టర్ విమల్ కృష్ణ మాట్లాడుతూ.. ''డిజె టిల్లు ట్రైలర్ చూసి ఇది పూర్తి రొమాంటిక్ సినిమా అనుకుంటున్నారు. కానీ సినిమాలో కొన్ని చోట్ల మాత్రమే రొమాంటిక్.........
DJ Tillu : సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా రాబోతున్న సినిమా ‘డిజె టిల్లు’. ఈ సినిమాని విమల్ కృష్ణ తెరకెక్కిస్తుండగా సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. ‘డిజె టిల్లు’ సినిమా ఈ నెల 12న విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా డైరెక్టర్ విమల్ కృష్ణ ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు తెలియచేశాడు.
‘డిజె టిల్లు’ డైరెక్టర్ విమల్ కృష్ణ మాట్లాడుతూ.. ”డిజె టిల్లు ట్రైలర్ చూసి ఇది పూర్తి రొమాంటిక్ సినిమా అనుకుంటున్నారు. కానీ సినిమాలో కొన్ని చోట్ల మాత్రమే రొమాంటిక్ సన్నివేశాలు ఉంటాయి. కుటుంబంతో కలిసి ‘డిజె టిల్లు’ సినిమా చూడొచ్చు. పదేళ్లుగా నాకు సిద్ధు తెలుసు. టిల్లు పాత్రకు తను సరిపోతాడు అనిపించి తనకు కథ చెప్పాను. కథ నచ్చి చేస్తా అన్నాడు. ఈ సినిమాకి నేను కథ, స్క్రీన్ ప్లే మాత్రమే రాశాను. హీరో సిద్ధునే డైలాగ్స్ రాశాడు. ఈ సినిమాకి త్రివిక్రమ్గారు స్క్రిప్టు విషయంలో సలహాలిచ్చారు.
Jayasudha : సహజనటి జయసుధకి కరోనా.. అమెరికాలోనే చికిత్స..
‘కృష్ణ అండ్ హిజ్ లీల’ సినిమా రిలీజయ్యాక నిర్మాత వంశీగారి నుంచి సిద్ధూకు కాల్ వచ్చింది. అప్పటికే మేము రెడీ చేసిన ‘డిజె టిల్లు’ కథ వంశీగారికి చెప్పగా ఆయనకీ నచ్చి సితార బేనర్లోనే సినిమా చేద్దామన్నారు. రీసెంట్ గా ‘డిజె టిల్లు’ సినిమా ట్రైలర్ చూశాక ముగ్గురు నిర్మాతలు సినిమా చేద్దామని నాకు ఫోన్ చేశారు. ఈ సినిమా రిలీజ్ అయ్యాక వారితో పూర్తిగా మాట్లాడి నా తదుపరి సినిమాల గురించి చెప్తాను అని తెలిపాడు.”