PM KISAN: రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం.. 31న రైతుల ఖాతాల్లోకి నగదు?
ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన లబ్ధిదారులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. 11వ విడత ఈ పథకం కింద రూ.21,000 కోట్లకుపైగా నిధులను మే 31వ తేదీన రైతుల ఖాతాల్లోకి జమ చేయనుంది. ఈ మేరకు ప్రధాన మంత్రి కార్యాలయం శనివారం వెల్లడించింది.
PM KISAN: ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన లబ్ధిదారులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. 11వ విడత ఈ పథకం కింద రూ.21,000 కోట్లకుపైగా నిధులను మే 31వ తేదీన రైతుల ఖాతాల్లోకి జమ చేయనుంది. ఈ మేరకు ప్రధాన మంత్రి కార్యాలయం శనివారం వెల్లడించింది. ఆజాదీకా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో భాగంగా దేశంలో తొమ్మిది మంత్రిత్వ శాఖలు, విభాగాల పరిధిలో పదహారు పథకాల కార్యక్రమాలు వివరించనున్నారు. గరీబ్ కళ్యాణ్ సమ్మేళన్ పేరుతో జాతీయ స్థాయి కార్యక్రమం 31న సిమ్లాలో జరగనుంది. ఇక్కడ ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న లబ్ధిదారులతో మాట్లాడుతారు.
PM KISAN: పీఎం కిసాన్ పథకం వర్తించాలంటే అలా చేయాల్సిందే.. మే31 వరకే అవకాశం..
ఈ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 11వ విడత కిసాన్ సమ్మాన్ నిధి భృతిని విడుదల చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఉన్న చిన్న, సన్న కారు రైతులకు పంట పెట్టుబడి సాయం కింద ఏడాదికి మూడు విడతల్లో రూ.6వేలు జమ చేస్తుంది. తాజాగా ఈ ఏడాది రెండవ విడత నగదును ప్రధాని విడుదల చేయనున్నారు. దీనికితోడు పలువురు లబ్ధిదారులతో ప్రధాన మంత్రి వీడియో కాన్ఫరెన్స్ లోనూ మాట్లాడనున్నట్లు తెలుస్తోంది..
PM Kisan Samman Nidhi : రైతులకు నిధులు విడుదల చేసిన ప్రధాని మోడీ
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకాన్ని కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 2018లో ప్రారంభించింది. దేశంలోని చిన్న, సన్నకారు రైతులకు కొంతమేర ఆర్థికంగా వెసులుబాటు కల్పించేందుకు ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. ఈ పథకం కింద ఏడాదికి రూ.6వేలు మూడు విడతల్లో రైతుల ఖాతాల్లో జమ అవుతున్నాయి. ఇప్పటికే పది విడతలుగా కేంద్ర రైతుల ఖాతాల్లో రూ.2వేలు చొప్పున నగదు జమచేసింది. ఇప్పటి వరకు రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం పీఎం-కిసాన్ పథకంపై రూ.1.80 లక్షల కోట్లు ఖర్చు చేసింది.
PM Kisan Funds : నేడు రైతుల ఖాతాల్లో పీఎం కిసాన్ నిధులు జమ.. 10 కోట్లకు పైగా రైతు కుటుంబాలకు లబ్ధి
ఇదిలా ఉంటే 10వ విడతలో 11 కోట్ల మందికి పైగా లబ్ధిదారులకు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోకి నిధులను కేంద్రం జమ చేసింది. అయితే 11వ విడతలో భాగంగా ఈ-కేవైసీ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. అర్హులైన లబ్ధిదారులకు మాత్రమే ఈ నగదు చేరేలా, పథకంలో అవినీతిని అరికట్టేందుకు కేంద్రం ఈ విధానాన్ని అమలు చేస్తోంది. ఇందుకుగాను మే 31వరకు చివరి తేదీని ప్రకటించింది. అయితే అదే రోజు పీఎం కిసాన్ సమ్మాన్ పథకం నిధులు రైతుల ఖాతాల్లో జమకానుండటం గమనార్హం.