ప్రియుడితో కలిసి భర్తను కాటికి పంపించిన భార్య..కరోనా మరణంగా చిత్రీకరించాలని అనుకుని
సమాజంలో ఒకరికి తెలియకుండా మరొకరితో అక్రమ సంబంధం పెట్టుకుంటున్నారు. అక్రమ సంబంధాల కారణంగా ఎన్నో జీవితాలు నాశనమైపోతున్నాయి. వారి పిల్లలు రోడ్డున పడుతున్నారు. అడ్డుగా ఉన్నారనే కారణంతో హత్యలకు తెగబడుతున్నారు. చిన్న పిల్లలు, కట్టుకున్న భార్య, భర్తలను చంపేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే ఢిల్లీలో చోటు చేసుకుంది. ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తనే హతమార్చింది ఓ భార్య. కరోనా మరణంగా చిత్రీకరించాలని అనుకుని కటకటాలపాలైంది. ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
ఢిల్లీలోని అశోక్ విహార్ లో శరత్ దాస్, భార్య అనితతో కలసి నివాసం ఉంటున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు. మే 02వ తేదీన శరత్ నిద్రలేవలేదు. కరోనా వైరస్ సోకడంతో తన భర్త చనిపోయాడని స్థానికంగ ఉండే వారిని నమ్మించే ప్రయత్నం చేసింది. కానీ శరత్ ను ఎప్పుడు చూసే..వారు అనుమానం వ్యక్తం చేశారు. ఎలాంటి అనారోగ్య సమస్యలు లేని శరత్ ఎలా చనిపోతాడని భావించి..అంత్యక్రియలను అడ్డుకుని..పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసులు అక్కడకు చేరుకుని శరత్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం బాబు జగ్జీవన్ రామ్ మెమోరియల్ ఆసుపత్రికి తరలించారు. ఇక్కడే షాకింగ్ న్యూస్ తెలిసింది. శరత్ కు కరోనా వైరస్ సోకలేదని, ఊపిరాడక మృతి చెందాడని రిపోర్టులే బయటపడింది. కరోనా వైరస్ తో చనిపోతే..ఇందుకు సంబంధించిన రిపోర్ట్స్ చూపించాలని పోలీసులు అనితపై వత్తిడి చేశారు. పోలీసులు జరిపిన విచారణతో తన ప్లాన్ వర్కవుట్ కాదని అనిత భావించింది. ఇక నిజం చెప్పేసింది.
తాను సంజయ్ అనే వ్యక్తితో ప్రేమాయణం నడుపుతున్నానని, తమ మధ్య శారీరక సంబంధం ఉందని తెలుసుకున్న భర్తతో గొడవలు జరుగుతుండేవని చెప్పింది. దీంతో తన భర్తను అంతం చేయాలని అనుకుని…భర్త శరత్ పై దిండు పెట్టి ఊపిరి ఆడకుండా చేసి..చంపేసినట్లు వెల్లడించింది. మొత్తానికి అక్రమసంబంధం వల్ల మరో ప్రాణం పోయింది.
Read More :
* పాలవాడితో ఆంటీ అక్రమ సంబంధం, లాక్ డౌన్ తో బయటపడిన వ్యవహారం