Xiaomi laptop వచ్చేస్తోంది.. ధరెంతో తెలుసా?

  • Published By: Subhan ,Published On : June 6, 2020 / 02:46 PM IST
Xiaomi laptop వచ్చేస్తోంది.. ధరెంతో తెలుసా?

స్మార్ట్ ఫోన్, స్మార్ట్ టీవీ తర్వాత ఇన్నేళ్లకు మరో అడుగు ముందుకేసింది Xiaomi. తొలి ల్యాప్‌టాప్‌ను లాంచ్ చేయడానికి సిద్ధమైంది. జూన్ 11న Dell, Acer లాంటి ఇతర టాప్ కంపెనీలతో ఛాలెంజ్ చేస్తూ అద్భుతమైన ఫీచర్లతో రిలీజ్ అయ్యేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు Mi ల్యాప్‌ట్యాప్ మల్టీ టాస్క్‌లు చేసేవారికి, గేమ్స్ ఆడేవారిని టార్గెట్ చేసుకుని రెడీ చేశారు. 

కొవిడ్ 19 ప్రబలుతున్న తరుణంలో వర్క్ ఫ్రమ్ హోమ్ కంటిన్యూ చేస్తున్నారంతా. ఇదే కరెక్ట్ టైం అని భావించి యాజమాన్యం లాంచింగ్ కు సిద్ధమైంది. విడుదల కాకముందే ఈ ల్యాప్ టాప్ పై పలు రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. అధికారికంగా ఇండియాలోనే లాంచ్ చేస్తారని ప్రకటించకపోయినా జూన్ 11న లాంచ్ చేయడం కన్ఫామ్. 

ఇందులో sleek design, 13-inch display, Intel Core i7 processor, ఎక్కువ storage, long-lasting battery life వంటి ఫీచర్లు ఉన్నాయి. Xiaomi 1C ఛార్జింగ్ టెక్నాలజీతో ఉంటాయి. మూవీలు చూసేవారికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. 

ధర సుమారుగా రూ.44వేల 500ఉండొచ్చని అంచనా. స్మార్ట్ ఫోన్లుకు పెట్టే డబ్బులకు మరికొంచెం జోడిస్తే ల్యాప్ ట్యాప్ యే వస్తుంది. ఊహించిన దానికంటే తక్కువ ధరకే అందుబాటులోకి తెచ్చి ఆశ్చర్యపరుస్తామని నిర్వాహకులు అంటున్నారు.