Imran Khan: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‭ను వదలని కష్టాలు.. మూడో భార్యపై సెక్స్ రాకెట్ ఆరోపణలు

పాకిస్థాన్‌లోని పంజాబ్‌లోని సర్గోధా నగరంలో 1970లో కషానా వెల్ఫేర్ హౌస్ స్థాపించబడిందని, ఇక్కడ గుర్తింపు వివరాలు ఏమీ ఇవ్వకుండా అనాథ, పేద బాలికలను ఉంచారట. దశాబ్దాలుగా అక్కడ బాలికలపై కిరాతక చర్యలు జరుగుతున్నాయని అఫాషా లతీఫ్ పేర్కొన్నారు

Imran Khan: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‭ను వదలని కష్టాలు.. మూడో భార్యపై సెక్స్ రాకెట్ ఆరోపణలు

Pakistan: జైల్లో ఉన్న పాకిస్థాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌‭కు కష్టాలు ఏమాత్రం తగ్గుముఖం పట్టడం లేదు సరికదా.. రోజు రోజుకు కొత్త కేసులు మెడకు చుట్టుకుంటున్నాయి. తాజాగా ఆయన మీద ఆయన మూడవ భార్య బుష్రా బీబీపై చాలా తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. ఇమ్రాన్ ఖాన్, భార్య బుష్రా బీబీ ఇద్దరూ కలిసి సెక్స్ రాకెట్ నడుపుతున్నారని అనాథ పిల్లల సంక్షేమ కేంద్రం సూపరింటెండెంట్‌గా ఉన్న ఒక మహిళ సంచలన ఆరోపణలు చేశారు.

Bandi Sanjay in AP politics : ఏపీ రాజకీయాల్లోకి బండి సంజయ్ ఎంట్రీ .. త్వరలోనే ఏపీకి తెలంగాణ బీజేపీ నేత

ఇమ్రాన్‌ఖాన్‌ దేశ ప్రధానిగా ఉన్నప్పుడు అనాథ బాలికలను తన ఇంటికి పంపారని కష్ణా సంక్షేమ హౌస్‌ మాజీ సూపరింటెండెంట్‌ అఫాషా లతీఫ్‌ పేర్కొన్నట్లు పాక్‌ మీడియా పేర్కొంది. అంతే కాదు, ఇలాంటి దారుణానికి గురైన అమ్మాయిలను నోరు విప్పవద్దంటూ బెదిరించారట. ఇక వారు వదిలేసిన చాలా మంది బాలికలు ఇప్పటికీ కనిపించకుండా పోయారని లతీఫ్ పేర్కొన్నారు. ఇమ్రాన్ ఖాన్ మూడో భార్య బుష్రా బీబీ అంటే పింకీ పిర్నీ కోరిక మేరకే ఇదంతా జరిగిందని లతీఫ్ పేర్కొన్నారు.

చాలా మంది అమ్మాయిలు హత్యకు గురయ్యారు
అనాధ బాలికలను జంతువుల కంటే హీనంగా చూస్తున్నారని అఫాషా లతీఫ్ ఆవేదన వ్యక్తం చేశారట. చాలా మంది బాలికల ప్రైవేట్ పార్ట్‌లు గాయాలయి శస్త్రచికిత్స చేయాల్సి వచ్చిందట. ఇమ్రాన్ ఖాన్, భార్య బుష్రా బీబీతో పాటు అజ్మల్ చీమాను కూడా ఆమె ప్రస్తావించారు. బాలికలను లైంగికంగా వేధించిన అనంతరం, చీమాను పిచ్చివాడిగా ప్రకటించి మానసిక ఆశ్రమానికి తరలించారని చెప్పారు. దీనితో పాటు, ఇమ్రాన్ ఖాన్ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో చాలా మంది బాలికలు హత్యకు గురయ్యారని మాజీ సూపరింటెండెంట్ ఆరోపించారు.

ఇమ్రాన్ ఖాన్ తన సన్నిహితులతో లైంగిక వేధింపులకు పాల్పడేవాడు
పాకిస్థాన్‌లోని పంజాబ్‌లోని సర్గోధా నగరంలో 1970లో కషానా వెల్ఫేర్ హౌస్ స్థాపించబడిందని, ఇక్కడ గుర్తింపు వివరాలు ఏమీ ఇవ్వకుండా అనాథ, పేద బాలికలను ఉంచారట. దశాబ్దాలుగా అక్కడ బాలికలపై కిరాతక చర్యలు జరుగుతున్నాయని అఫాషా లతీఫ్ పేర్కొన్నారు. ఇమ్రాన్ ఖాన్ సన్నిహితులు ఈ అమ్మాయిల వ్యాపారం చేయడంలో పాలుపంచుకుంటున్నారట. ఈ మొత్తం విషయాన్ని బయటపెడుతూ అఫాషా లతీఫ్ ఓ లేఖ కూడా రాయడంతో విషయం వైరల్ అవుతోంది. ఇదంతా చూడలేక నా ఉద్యోగాన్ని, ప్రాణాలను పణంగా పెట్టి ఇమ్రాన్ ఖాన్ చేసిన చీకటి చేష్టలను ఎప్పటికప్పుడు బయటపెట్టానని అఫాషా చెప్తున్నారు.