Suriya : అభిమాని మరణం.. ఇంటికి వెళ్లి కుటుంబసభ్యులను పరామర్శించిన సూర్య..

అభిమాని మరణించాడని తెలుసుకొని అతడి ఇంటికి వెళ్లి కుటుంబసభ్యులను పరామర్శించిన సూర్య.

Suriya : అభిమాని మరణం.. ఇంటికి వెళ్లి కుటుంబసభ్యులను పరామర్శించిన సూర్య..

Suriya Visited a Fan House And Offered Condolences to his family

Suriya : కోలీవుడ్ స్టార్ హీరో సూర్య సినిమాలతో ఎంత బిజీగా ఉన్నపటికీ.. తన అభిమానులకు ఏమన్నా ప్రమాదం జరిగింది అని తెలియగానే వెంటనే రెస్పాండ్ అవుతుంటాడు. ఈక్రమంలోనే గతంలో విదేశాల్లో జరిగిన కాల్పుల్లో మరణించిన తెలుగు మహిళా అభిమాని కుటుంబానికి ఒక లేఖ రాస్తూ వారికీ సానుభూతుని తెలియజేశాడు. ఇక ఇటీవల సూర్య బర్త్ డే సెలబ్రేషన్స్ లో ఒక అభిమాని కరెంటు షాక్ వలన మరణించాడు.

Nayanthara : 50 సెకన్ల యాడ్‌ కోసం నయనతార అంత రెమ్యూనరేషన్ తీసుకుంటుందా..?

ఇక ఆ విషయం తెలుసుకున్న సూర్య వెంటనే ఆ కుటుంబసభ్యులకు వీడియో కాల్ చేసి ఓదార్పుని ఇచ్చాడు. తాజాగా సూర్య అభిమాని ఒకరు రోడ్ ప్రమాదంలో మరణించాడు. ఇక ఈ విషయం తెలుసుకున్న సూర్య.. వారి ఇంటికి వెళ్లి అభిమాని ఫోటోకి నివాళ్లు అర్పించి, ఆ కుటుంబానికి ధైర్యం చెప్పాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ పిక్స్ చూసిన నెటిజెన్స్ సూర్యని అభినందిస్తున్నారు.

Jawan : ఒక టికెట్ కొంటే మరో టికెట్ ఉచితం.. జవాన్ ఆఫర్ అందుకోసమేనా..?

కాగా సూర్య సినిమాలు విషయానికి వస్తే.. ప్రస్తుతం ‘కంగువ’ సినిమాలో నటిస్తున్నాడు. తమిళ మాస్ డైరెక్టర్ శివ ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీలో సూర్య వారియర్ రోల్ లో నటిస్తున్నాడు. అంతేకాదు సూర్య మరికొన్ని పాత్రల్లో కూడా కనిపించబోతున్నాడని తెలుస్తుంది. సూర్య సరసన ఈ సినిమాలో దిశా పటాని నటిస్తుంది.

సూర్య పుట్టినరోజు నాడు రిలీజ్ అయిన టీజర్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ కలిసి ఈ సినిమాని 300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ సినిమాని రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. తమిళ్, తెలుగుతో పాటు మొత్తం టెన్ లాంగ్వేజ్స్ లో ఈ మూవీ రిలీజ్ కానుంది.