KTR : మీ అకౌంట్లో రూ.15లక్షలు పడితే మోడీకి ఓటు వేయండి, రైతుబంధు డబ్బులు పడితే బీఆర్ఎస్‌కు ఓటు వేయండి : కేటీఆర్

కాంగ్రెస్ కి ఒక్కఛాన్స్ కాదు.. 55 ఏళ్ళు  ఛాన్స్ ఇచ్చాము.. ఎం చేశారు..?? కాంగ్రెస్ పార్టీ అనేది సచ్చిన పీనుగు..ఆ పీనుగును లేపే ప్రయత్నం చేస్తున్నారు అంటూ ఎద్దేవా చేశారు.

KTR : మీ అకౌంట్లో రూ.15లక్షలు పడితే మోడీకి ఓటు వేయండి, రైతుబంధు డబ్బులు పడితే బీఆర్ఎస్‌కు ఓటు వేయండి : కేటీఆర్

KTR

Minister KTR : నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని మినిస్టేడియంలో బి.ఆర్.ఎస్ బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ ప్రసంగిస్తు..తొమ్మిదన్నారేళ్లలో మా ప్రభుత్వం ఎం చేశామో చెప్పే బాధ్యత మాపై ఉంది..మేం చెప్పింది నిజమైతేనే మాకు ఓటు వేయండి అంటూ వ్యాఖ్యానించారు. 2014 కి ముందు కరెంట్, తాగు, సాగు నీరు పరిస్థితి ఎలా ఉంది.. ఇప్పుడు ఎలా ఉందో కళ్లముందు కనిపిస్తోంది..ఎవరు కలలో కూడా ఊహించని విధంగా నిర్మల్ జిల్లా కేంద్రమైంది ఇది కాదా అభివృద్ధి అని అన్నారు.

తెలంగాణ జిల్లా కలెక్టరేట్ల తరహాలో ఏ రాష్ట్రాల్లో సెక్రటేరియట్ లు కూడా లేవన్నారు.దేశంలో రాష్ట్రంలో రైతులకు 24గం.ల కరెంట్ ఇవ్వడంలేదు ..కాంగ్రెస్ బిజెపి నేతలకు 30బస్సులు పెడుతాం.. ఉమ్మడి జిల్లాలో ఎక్కడికెళ్లయిన కరంట్ చెక్ చేసుకోండి అంటూ సవాల్ విసిరారు.కాంగ్రెస్ హయాంలో ఏనాడు వరుసగా 6 గం.ల కరెంట్ ఇవ్వలేదని ఇప్పుడు మా ప్రభుత్వంలో అటువంటి దుస్థితి లేదన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా వికలాంగులు, బీడీ కార్మికులకు పెన్షన్లు ఇస్తున్న ఘనత కేసీఆర్ దేనని అన్నారు.

Bandi Sanjay : బిడ్డా కేటీఆర్.. మేం తిట్టడం స్టార్ట్ చేస్తే తట్టుకోలేవ్ : బండి సంజయ్

13 లక్షల ఆడపిల్లలకు కళ్యాణాలక్ష్మి, షాది ముబారక్ ఇచ్చి పెళ్లిచేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనన్నారు. 15లక్షల మందికి కేసీఆర్ కిట్లు పంపిణీ చేసామని..నిర్మల్ లో మెడికల్ కళాశాల వస్తుందని ఎవరు కలలో కూడా ఊహించలేదు ..అటువంటి కలను నిజం చేసి చూపించామనన్నారు. ఆరున్నర లక్షల మంది పిల్లలు గురుకులాల్లో చదువుతున్నారని తెలిపారు. తాము డిల్లీ, గుజరాత్ లకు గులాం కాదు, ఎవరికో బి-టీం కాదు, మేం తెలంగాణ ప్రజలకి బి-టీం అన్నారు.

2014లో రూ.400 ఉన్న సిలెండర్ ధర రూ.1250 పెంచిన ఘనత మోడీదేనని ఎద్దేవా చేశారు. మోదీని దేవుడని ఊరేగుతున్నారు..ఎందుకు మోదీ దేవుడు..? పెట్రో ధరలు అమాంతం పెంచినందుకా మోడీ దేవుడు? అంటూ ప్రశ్నించారు. నల్లధనం తెస్తానని హామీలిచ్చిన మోదీ నల్లధనం మాట దేవుడెరుగు మోడీ దేశంలో నల్ల చట్టాలు తెచ్చారు అంటూ ఎద్దేవా చేశారు. 15లక్షలు అకౌంట్లో పడితే మోడీకి ఓటు వేయండి, రైతుబంధు అకౌంట్లో పడితే బి.ఆర్.ఎస్ కి ఓటు వేయండిఅంటూ ప్రజలకు పిలుపునిచ్చారు.

Bandi Sanjay : దమ్ముంటే.. అలా అనలేదని అమ్మవారి ఆలయం ముందు ప్రమాణం చేయాలి? కేసీఆర్‌కు బండి సంజయ్ సవాల్

నన్ను సీఎం చేయలనుంకుంటే మా పార్టీ ప్రజలు నిర్ణయిస్తారు.. మోడీ NOC మాకు అక్కర్లేదు అంటూ దుయ్యబట్టారు. హిందూ ముస్లిం పేరుతో మతచిచ్చు పెడుతున్నారు అంటూ విమర్శలు సంధించారు.ఈ సందర్బంగా కేటీఆర్ కాంగ్రెస్ పై కూడా విరుచుపడ్డారు. కాంగ్రెస్ కి ఒక్కఛాన్స్ కాదు.. 55 ఏళ్ళు  ఛాన్స్ ఇచ్చాము.. ఎం చేశారు..?? కాంగ్రెస్ పార్టీ అనేది
సచ్చిన పీనుగు..ఆ పీనుగును లేపే ప్రయత్నం చేస్తున్నారు అంటూ ఎద్దేవా చేశారు. ఆరు దశాబ్దాల ఆగం చేసిన కాంగ్రెస్.. ఇప్పుడు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారంటూ మండిపడ్డారు. నిర్మల్ మాస్టర్ ప్లాన్ పై రెచ్చగొడున్నారు ఎవ్వరు కంగారుపడొద్దని సూచించారు. రైతులకు, ఎవరికి నష్టం జరగకుండా అభిప్రాయ సేకరణ అనంతరం మాస్టర్ ప్లాన్ అమలు చేస్తామని హామీ ఇచ్చారు.ఖానాపూర్ వెనకబడింది.. జాన్సన్ ను గెలిపిస్తే అభివృద్ధిలో పోటీపడేలా చేస్తాం అని హామీ ఇచ్చారు మంత్రి కేటీఆర్.