Rohit Sharma : భార్య, కూతురితో స్వదేశానికి చేరుకున్న రోహిత్ శర్మ.. వీడియో వైరల్
Rohit Sharma returns to India : టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ లండన్ విహార యాత్రను ముగించుకుని స్వదేశానికి చేరుకున్నాడు. సోమవారం తన భార్య రితికా సజ్దేహ్, కూతురు సమైరాతో కలిసి ముంబైకి చేరుకున్నాడు. ఎయిర్పోర్టులో రోహిత్ తన కుటుంబంతో ఉన్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
వన్డే ప్రపంచకప్ 2023 టోర్నీలో మంచి ప్రదర్శననే చేసిన టీమ్ఇండియా ఆఖరి మెట్టుపై బోల్తా పడింది. వరుసగా 10 మ్యాచుల్లో గెలుపొందిన భారత్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఆరు వికెట్ల తేడాతో ఓటమిని చవిచూసింది. ప్రపంచకప్ ముగిసిన నాలుగు రోజులకే ఆసీస్తో ఐదు మ్యాచుల టీ20 ను భారత్ ఆడింది. ఈ సిరీస్ నుంచి సీనియర్ ఆటగాళ్లు అయిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ వంటి ఆటగాళ్లు విశ్రాంతి తీసుకున్నారు.
IND vs SA : టీమ్ఇండియాతో సిరీస్.. కెప్టెన్కు షాకిచ్చిన దక్షిణాఫ్రికా.. పెద్ద ప్లానే..!
ఈ క్రమంలో రోహిత్ శర్మ తన భార్య, కూతురితో కలిసి లండన్ పర్యటనకు వెళ్లాడు. ఆ సమయంలో పలు ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో హిట్మ్యాన్ పంచుకున్నాడు. తాజాగా వీరు తమ పర్యటనను ముగించుకుని ముంబైకి చేరుకున్నారు. వీరు ఎయిర్ పోర్టు నుంచి బయటకు వస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియోలో రోహిత్ తన కూతురిని ఎత్తుకుని నడుస్తూ కనిపించాడు.
టెస్టులే ఆడనున్న రోహిత్ శర్మ..!
టీ20 ప్రపంచకప్ 2022 సెమీ ఫైనల్ మ్యాచ్ తరువాత నుంచి ఆ ఫార్మాట్కు దూరంగా ఉంటూ వస్తున్న రోహిత్ శర్మ వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్ మ్యాచ్ తరువాత వన్డేలకు సైతం దూరం అయినట్లే కనిపిస్తోంది. దక్షిణాఫ్రికాతో టీ20, వన్డే సిరీస్లల్లో రోహిత్ ఆడడం లేదు. కేవలం రెండు మ్యాచుల టెస్టు సిరీస్ మాత్రమే ఆడనున్నాడు. టెస్టుల్లో రోహిత్ నాయకత్వంలోనే టీమ్ఇండియా బరిలోకి దిగనుంది. డిసెంబర్ 26 నుంచి దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది.
Ruturaj Gaikwad : 10 పరుగులే చేసినా.. చరిత్ర సృష్టించిన రుతురాజ్ గైక్వాడ్.. ఒకే ఒక్కడు
ఇక వన్డే ప్రపంచకప్లో రోహిత్ శర్మ కెప్టెన్గానే కాకుండా బ్యాటర్గానూ అదరగొట్టాడు. 11 మ్యాచుల్లో 597 పరుగులు చేశాడు. ఈ మెగా టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు.
View this post on Instagram