Guntur Kaaram : గుంటూరు కారం మెలోడీ సాంగ్ ప్రోమో వచ్చేసింది.. ఓ మై బేబీ..
గుంటూరు కారం మూవీ ప్రమోషన్స్ ని మొదలు పెట్టిన చిత్ర యూనిట్.. ఒక్కో సాంగ్ రిలీజ్ చేసుకుంటూ వస్తున్నారు. ఈక్రమంలోనే మహేష్, శ్రీలీల పై వచ్చే 'ఓ మై బేబీ' అనే సాగే పాట ప్రోమోని నేడు రిలీజ్ చేశారు.
Guntur Kaaram : త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా మీనాక్షి చౌదరి, శ్రీలీల హీరోయిన్స్ గా తెరకెక్కుతున్న సినిమా గుంటూరు కారం.. 2024 సంక్రాంతి కానుకగా ఆడియన్స్ ముందుకు రాబోతుంది. ఇక ఈ మూవీ ప్రమోషన్స్ ని మొదలు పెట్టిన చిత్ర యూనిట్.. ఒక్కో సాంగ్ రిలీజ్ చేసుకుంటూ వస్తున్నారు. ఈక్రమంలోనే మహేష్, శ్రీలీల పై వచ్చే ‘ఓ మై బేబీ’ అనే సాగే పాట ప్రోమోని నేడు రిలీజ్ చేశారు.
పాటకి ముందు మహేష్ శ్రీలీల మధ్య ఒక చిన్న సంభాషణని కూడా రిలీజ్ చేశారు. మహేష్ బాబు, శ్రీలీలతో మాట్లాడుతూ..”అమ్ము గుర్తు పెట్టుకో రావణగాడు. గుంటూరు వస్తే పనికొస్తది” అంటూ చెప్పారు. దానికి శ్రీలీల తనకి గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు అన్నట్లుగా క్యూట్ ఎక్స్ప్రెషన్ తో ఆకట్టుకుంటున్నారు. ఇక ఈ లవ్లీ ప్రోమో చూసిన ఆడియన్స్ లో ఫుల్ సాంగ్ ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే క్యూరియాసిటీ క్రియేట్ అయ్యింది. ఫుల్ సాంగ్ ని డిసెంబర్ 13న రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. మరి రిలీజ్ అయిన ఆ లవ్లీ పోమోని మీరు కూడా చూసేయండి.
Also read : Producer SKN : బేబీ నిర్మాత ఎస్కేఎన్ నిర్మాణంలో “కల్ట్ బొమ్మ”.. ఎవరి కోసం ఈ టైటిల్..?
థమన్ సంగీతం అందిస్తున్న ఈ పాటకి రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించగా శిల్పా రావు పాటని పాడారు. మొదటి సాంగ్ ‘దమ్ మసాలా’ మాస్ దుమ్ము దులిపేసింది. ఇప్పుడు ఈ ఓ మై బేబీ సాంగ్ లవర్స్ ని ఆకట్టుకునేలా ఉంది. కాగా త్రివిక్రమ్, మహేష్ కాంబోలో వచ్చిన గత సినిమాలు అతడు, ఖలేజా ఆడియన్స్ ని ఆకట్టుకున్నప్పటికీ బాక్స్ ఆఫీస్ వద్ద కమర్షియల్ గా వర్క్ అవుట్ లేదు. అయితే ప్రస్తుతం మహేష్, త్రివిక్రమ్ ఫుల్ ఫార్మ్ లో ఉండడంతో.. ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి జనవరి 12న రిలీజ్ కాబోతున్న ఈ చిత్రం ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి.