Team India : ప్రాక్టీస్కు వెళ్లిన టీమ్ఇండియా క్రికెటర్లకు ఊహించని పరిస్థితి..!
దక్షిణాఫ్రికా పర్యటనను విజయంతో ముగించిన టీమ్ఇండియా ఇప్పుడు స్వదేశంలో మరో సమరానికి సన్నద్ధమైంది.
Team India Cricketers : దక్షిణాఫ్రికా పర్యటనను విజయంతో ముగించిన టీమ్ఇండియా ఇప్పుడు స్వదేశంలో మరో సమరానికి సన్నద్ధమైంది. అఫ్గానిస్తాన్తో మూడు మ్యాచుల టీ20 సిరీస్ ఆడనుంది. మొహాలీ వేదికగా నేడు (జనవరి 11 గురువారం) మొదటి టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ క్రమంలో ఈ మ్యాచ్ కోసమని ఉదయాన్నే టీమ్ఇండియా ఆటగాళ్లు ప్రాక్టీస్ చేసేందుకు మైదానానికి వెళ్లారు. అయితే.. వారికి అక్కడి పరిస్థితులు పరీక్ష పెట్టాయి.
మొహాలీ స్టేడియం మొత్తం పొగమంచుతో నిండిపోయింది. చల్లని గాలులు వీస్తుండడంతో భారత ఆటగాళ్లు తలకు మంకీ క్యాప్, స్వెటర్లు ధరించి గ్రౌండ్లోకి దిగారు. అయినప్పటికీ చలి తీవ్రత ఎక్కవుగా ఉండడంతో కొంత ఇబ్బంది పడ్డారు. ఈ క్రమంలో పలు సరదా సంభాషణలు చోటు చేసుకున్నాయి.
గడ్డ కట్టుకునిపోతానేమో..
ఇక పంజాబ్ తరుపున దేశవాలీ క్రికెట్ ఆడిన పేసర్ అర్ష్దీప్ సింగ్, బ్యాటర్ శుభ్మన్ గిల్ల మధ్య సంభాషణ హైలెట్ అని చెప్పొచ్చు. ‘నాకు వెచ్చగా అనిపిస్తోంది. అందుకునే హాఫ్ స్లీవ్స్ వేసుకున్నా.. ఇంకొంచెం చల్లగా ఉంటే బాగుండు.’ అంటూ అర్ష్ దీప్ అన్నాడు. దీనిపై గిల్ స్పందిస్తూ ‘నాకైతే అంత చలిగా లేదు.’ అంటూ సరదాగా కౌంటర్ ఇచ్చాడు.
మరికాసేపటి గిల్ మాట్లాడుతూ.. ‘ఇక్కడ చాలా చలిగా ఉంది. 7 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్నట్లుగా అనిపిస్తోంది. అందుకనే చేతుల్ని జేబులో పెట్టుకున్నా.’ అని అన్నాడు. ‘బెంగళూరులో పుట్టి పెరిగిన నేను ఇక్కడ చలికి గడ్డ కట్టుకునిపోయేలా ఉన్నాను.’ అంటూ టీమ్ఇండియా హెచ్ కోచ్ ద్రవిడ్ అన్నాడు. ఇలా ఆటగాళ్ల సరదాగా మాట్లాడుకుంటూ ప్రాక్టీస్ను చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్గా మారింది.
టీ20 జట్టులోకి కోహ్లీ, రోహిత్ల ఎంపిక పై సురేశ్ రైనా ఆసక్తికర వ్యాఖ్యలు
టీ20 ప్రపంచకప్ 2024 ముందు టీమ్ఇండియా ఆటగాళ్లు ఆడనున్న చివరి టీ20 సిరీస్ ఇదే కానుండడంతో విజయే లక్ష్యంగా భారత్ బరిలోకి దిగుతోంది. దాదాపు 14 నెలల తరువాత స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు టీ20 జట్టులోకి వచ్చారు. అయితే.. వ్యక్తిగత కారణాలతో మొదటి టీ20 మ్యాచ్కు కోహ్లీ దూరం అయ్యాడు.
Jacket 🧥 ON
Warmers ON
Gloves 🧤 ON #TeamIndia have a funny take on their “chilling” ❄️🥶 training session in Mohali. #INDvAFG | @IDFCFIRSTBank pic.twitter.com/rWeodTeDr2— BCCI (@BCCI) January 11, 2024