IND vs AFG 3rd T20 : మూడో టీ20కి ముందు.. భార‌త ఆట‌గాళ్ల‌ను క‌లిసేందుకు ఎవ‌రొచ్చారో చూశారా..?

బెంగ‌ళూరు వేదిక‌గా బుధ‌వారం భారత్, అఫ్గానిస్తాన్ జ‌ట్ల మ‌ధ్య మూడో టీ20 మ్యాచ్ జ‌ర‌గ‌నుంది.

IND vs AFG 3rd T20 : మూడో టీ20కి ముందు.. భార‌త ఆట‌గాళ్ల‌ను క‌లిసేందుకు ఎవ‌రొచ్చారో చూశారా..?

Rishabh Pant makes appearance at India training session in Bengaluru

IND vs AFG 3rd T20 : బెంగ‌ళూరు వేదిక‌గా బుధ‌వారం భారత్, అఫ్గానిస్తాన్ జ‌ట్ల మ‌ధ్య మూడో టీ20 మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. ఇప్ప‌టికే తొలి రెండు మ్యాచుల్లో టీమ్ఇండియా విజ‌యం సాధించ‌డంతో ఈ మ్యాచ్ నామ‌మాత్రంగా మారింది. అయిన‌ప్ప‌టికీ ఈ మ్యాచులోనూ గెలిచి సిరీస్ క్లీన్ స్వీప్ చేయాల‌ని భార‌త్ భావిస్తోంది. ఈ క్ర‌మంలోనే మ్యాచ్ కోసం చిన్న‌స్వామి స్టేడియంలో ఆట‌గాళ్లు ప్రాక్టీస్ సెష‌న్‌లో పాల్గొన్నారు. అయితే.. టీమ్ఇండియా ప్లేయ‌ర్లు ప్రాక్టీస్ చేస్తుండ‌గా అక్క‌డికి వికెట్ కీప‌ర్ రిష‌బ్ పంత్ వ‌చ్చాడు.

గాయాల నుంచి కోలుకున్న పంత్ ప్ర‌స్తుతం ఫిట్‌నెస్ సాధించే ప‌నిలో ఉన్నాడు. బెంగ‌ళూరులోని నేష‌న‌ల్ క్రికెట్ అకాడ‌మీ(ఎన్‌సీఏ)లో ఈ మేర‌కు క‌ష్ట‌ప‌డుతున్నాడు. బెంగళూరులోనే మూడో టీ20 మ్యాచ్ జ‌ర‌గ‌నుండ‌డంతో భార‌త ఆట‌గాళ్ల‌ను క‌లిసేందుకు పంత్ స్టేడియానికి వ‌చ్చాడు.

Virat Kohli : విరుష్క దంప‌తుల‌కు అందిన రామ మందిర ప్రాణ ప్ర‌తిష్ఠ ఆహ్వానం..

అక్క‌డ కాసేపు ఆట‌గాళ్ల‌తో స‌ర‌దాగా మాట్లాడాడు. ముఖ్యంగా కోహ్లీ, రింకూసింగ్‌తో పంత్ మాట్లాడుతున్న‌ ఫోటోలు, వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

2022 డిసెంబ‌ర్ 30న రోడ్డు ప్ర‌మాదంలో రిష‌బ్ పంత్ గాయ‌ప‌డిన సంగ‌తి తెలిసిందే. పంత్‌కు శ‌స్త్ర‌చికిత్స నిర్వ‌హించారు. గాయాల నుంచి కోలుకున్న పంత్ ప్ర‌స్తుతం ఎన్‌సీఏలో పున‌రావాసం పొందుతున్నాడు. ఐపీఎల్ 2024 స‌మ‌యానికి క‌ల్లా పూర్తి ఫిట్‌నెస్ సాధించేందుకు కృషి చేస్తున్నాడు. ఈ టోర్నీ ద్వారా పంత్ క్రికెట్‌లో పున‌రాగ‌మ‌నం చేయాల‌ని కృత‌నిశ్చ‌యంతో ఉన్నాడు. ఢిల్లీ క్యాపిట‌ల్స్‌కు పంత్ నాయ‌క‌త్వం వ‌హిస్తున్నాడు.

MS Dhoni : ధోనిని క‌లిసిన భార‌త మ‌హిళా స్టార్ క్రికెట‌ర్‌.. ‘అప్పుడు ఓ ఆట‌గాడిగా ఇష్ట‌ప‌డేదాన్ని కానీ ఇప్పుడు..’