Badminton Asia Team Championships : చరిత్ర సృష్టించిన భారత మహిళా షట్లర్లు
మలేషియాలో జరుగుతున్న బ్యాడ్మింటన్ ఆసియా టీమ్ ఛాంపియన్షిప్లో భారత మహిళలు తమ జోరును కొనసాగిస్తున్నారు.
Badminton Asia Team Championships : మలేషియాలో జరుగుతున్న బ్యాడ్మింటన్ ఆసియా టీమ్ ఛాంపియన్షిప్లో భారత మహిళలు తమ జోరును కొనసాగిస్తున్నారు. సెమీఫైనల్లో జపాన్ను ఓడించి తొలిసారి ఈ టోర్నీలో ఫైనల్కు చేరుకుని చరిత్ర సృష్టించారు. ఉత్కంఠభరితంగా సాగిన పోటీల్లో 3-2 తేడాతో జపాన్ను ఓడించారు.
మొదటి మ్యాచ్లో పీవీ సింధు పోరాడి ఓడింది. అయా ఒహోరి చేతితో 13-21, 20-22 తేడాతో ఓటమిపాలైంది. అయితే.. రెండో మ్యాచ్లో భారత జోడీ గాయత్రీ గోపిచంద్-త్రిసా జోడీ 21-17, 16-21, 22-20 తేడాతో నమీ మత్సుమయ-చిహారు షిదపై గెలుపొందింది. ఈ క్రమంలో ఇరు జట్లు 1-1తో సమంగా నిలిచాయి.
తదుపరి మ్యాచ్లో అష్మితా పై 21-17, 21-14 తేడాతో ఒకుహర విజయం సాధించింది. దీంతో జపాన్ మరోసారి 2-1 ఆధిక్యంలోకి దూసుకువెళ్లింది.
Jonny Bairstow : ఏంటయ్యా ఇదీ.. భారత్ అంటే అంత భయపడిపోతున్నావ్ ఎందుకు? ఇలా అయితే కెరీర్ ఖతం
HISTORY SCRIPTED 🤩🤩
First-ever final for #TeamIndia at #BATC 🥳
Courtesy: 17 year old Anmol Kharb@himantabiswa | @sanjay091968 | @lakhaniarun1 #BATC2024#IndiaontheRise#Badminton pic.twitter.com/2LbQSmzqWO
— BAI Media (@BAI_Media) February 17, 2024
మరో గేమ్లో అశ్విని పొన్నప్ప-పీవీ సింధు జోడీ మియుర-అయకో సుకురమోటో పై 21-14, 21-11 తేడాతో గెలుపొందింది. దీంతో 2-2తో ఇరు జట్లు సమంగా నిలిచాయి. కీలకమైన ఐదో మ్యాచ్లో ఎవరు గెలిస్తే వారు ఫైనల్ చేరుకుంటారు. ఈ కీలక మ్యాచ్లో యువ షట్లర్ అనయోల్ ప్రపంచ 29 ర్యాంకర్ నత్సుకి నిదైరా పై 21-14, 21-11 తేడాతో గెలిచింది.
దాదాపు 52 నిమిషాల పాటు ఈ మ్యాచ్ జరిగింది. ఫలితంగా 3-2 తేడాతో భారత్ బ్యాడ్మింటన్ ఆసియా టీమ్ ఛాంపియన్షిప్లో తొలిసారి ఫైనల్కు చేరుకుంది. ఫైనల్ మ్యాచ్లో భారత్ జట్టు థాయ్లాండ్తో తలపడనుంది. ఆదివారం ఈ మ్యాచ్ జరగనుంది. కాగా అంతక ముందు క్వార్టర్ ఫైనల్లో భారత జట్టు హంకాంగ్ పై విజయం సాధించిన సంగతి తెలిసిందే.
స్లిప్లో జైస్వాల్ స్టన్నింగ్ క్యాచ్.. బిత్తరపోయిన ఇంగ్లాండ్ ఆటగాడు జో రూట్