Yashasvi Jaiswal : య‌శస్వి జైస్వాల్‌కు అన్యాయం జ‌రుగుతోందా? మొన్న బుమ్రా, నేడు జ‌డేజా

టీమ్ఇండియా యువ ఆట‌గాడు య‌శ‌స్వి జైస్వాల్ మంచి ఫామ్‌లో ఉన్నాడు.

Yashasvi Jaiswal : య‌శస్వి జైస్వాల్‌కు అన్యాయం జ‌రుగుతోందా? మొన్న బుమ్రా, నేడు జ‌డేజా

Yashasvi Jaiswal

Yashasvi Jaiswal – Player of the Match : టీమ్ఇండియా యువ ఆట‌గాడు య‌శ‌స్వి జైస్వాల్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లో ప‌రుగుల వ‌ర‌ద పారిస్తున్నాడు. వ‌రుస మ్యాచుల్లో డ‌బుల్ సెంచ‌రీలు చేశాడు. తొలి టెస్టుల్లో శ‌త‌కం చేజారినా రెండు, మూడు టెస్టు మ్యాచుల్లో ద్విశ‌త‌కాలు బాదేశాడు. అయితే.. య‌శ‌స్వి జైస్వాల్‌కు అనాయ్యం జ‌రుగుతోందంటూ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఏ విష‌యంలో అంటే ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు.

జైస్వాల్‌కు ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు రాకుండా కొంద‌రు ప‌నిగ‌ట్టుకుని రాజ‌కీయాలు చేస్తున్నార‌ని మండిప‌డుతున్నారు. విశాఖ వేదిక‌గా జ‌రిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో జైస్వాల్ 209 ప‌రుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో బుమ్రాకు ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును ఇచ్చారు. బుమ్రా ఈ మ్యాచ్‌లో ఆరు వికెట్లు తీశాడు. తాజాగా రాజ్‌కోట్ వేదిక‌గా జ‌రిగిన మూడో టెస్టు మ్యాచ్‌లో జైస్వాల్‌ 214 ప‌రుగుల‌తో అజేయంగా నిలిచాడు. అయిన‌ప్ప‌టికీ అత‌డికి అవార్డు రాలేదు. ఐదు వికెట్ల‌తో పాటు సెంచ‌రీతో చెల‌రేగిన ఆల్‌రౌండ‌ర్ ర‌వీంద్ర జ‌డేజాకు ఈ అవార్డు ద‌క్కింది.

వ‌రుస‌గా మంచి స్కోర్లు చేస్తున్నా అవార్డు రాక‌పోవ‌డంతో జైస్వాల్ ఖ‌చ్చితంగా నిరాశ చెంది ఉంటాడ‌ని అంటున్నారు. దీనిపై సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది. కొంద‌రు జైస్వాల్‌కు మ‌ద్ద‌తు ఇస్తుంటే మ‌రికొంద‌రు జ‌డ్డూకు ప్లేయ‌ర్ ఆఫ్ ది అవార్డు ఇవ్వ‌డం క‌రెక్టే అని అంటున్నారు. ఇంకొంద‌రు మాత్రం ప్లేయ‌ర్ ఆఫ్ ది సిరీస్ జైస్వాల్‌దేన‌ని రాసిపెట్టుకోండ‌ని చెబుతున్నారు.