KTR: చిరునవ్వులు చిందిస్తూ.. అతడి ఆటోలో ప్రయాణించిన కేటీఆర్

దేవరాజు అనే వ్యక్తి కేటీఆర్‌ను కలిసి బీఆర్ఎస్ ప్రభుత్వంలో బీసీ బంధు పథకం ద్వారా ఆటో కొన్నానని తెలిపారు.

KTR: చిరునవ్వులు చిందిస్తూ.. అతడి ఆటోలో ప్రయాణించిన కేటీఆర్

మాజీ మంత్రి కేటీఆర్ మరోసారి ఆటోలో ప్రయాణించారు. ఇటీవలే ఆయన బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ నియోజకవర్గ సమీక్షా సమావేశం తర్వాత యూసఫ్‌గూడ నుంచి తెలంగాణ భవన్ వరకు ఆటోలో వెళ్లిన విషయం తెలిసిందే.

ఇవాళ బీసీబంధు లబ్ధిదారుడి ఆటోలో కేటీఆర్ ప్రయాణించారు. కేటీఆర్ ప్రస్తుతం సిరిసిల్ల పర్యటనలో ఉన్నారు. దేవరాజు అనే వ్యక్తి కేటీఆర్‌ను కలిసి బీఆర్ఎస్ ప్రభుత్వంలో బీసీ బంధు పథకం ద్వారా ఆటో కొన్నానని తెలిపారు. దేవరాజు కోరిక మేరకు కేటీఆర్‌ కాసేపు ఆటోలో ప్రయాణించారు. ఈ సందర్భంగా తీసిన వీడియోలు, ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

చాలా సింపుల్‌గా కేటీఆర్‌ ఆటోలో ప్రయాణించడం పట్ల నెటిజన్లు, బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. కాగా, లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ సమీక్షా సమావేశాలు నిర్వహిస్తోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీని ఎదుర్కొనేందుకు ప్రణాళికలు వేసుకుంటోంది.

 Read Also: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల