లోక్సభ ఎన్నికల ముందు కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు
Anurag Thakur: ఢిల్లీలో అదనంగా 20 కిలోమీటర్ల మెట్రో కారిడార్ కు క్యాబినెట్ ఆమోదం తెలిపిందన్నారు.
![లోక్సభ ఎన్నికల ముందు కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు లోక్సభ ఎన్నికల ముందు కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు](https://10tv.in/wp-content/uploads/2022/10/Sports-minister-Anurag-Thakur.jpg)
Anurag Thakur
కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించి వివరాలు తెలిపారు. ఢిల్లీ మెట్రో విస్తరణకు నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఢిల్లీలో అదనంగా 20 కిలోమీటర్ల మెట్రో కారిడార్ కు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. రెండు మెట్రో లైన్ల ద్వారా ఢిల్లీలో 20 కిలోమీటర్ల మేర నిర్మితం కానుందని తెలిపారు.
మే 31 వరకు కేంద్ర ప్రభుత్వ కాలపరిమితి ఉందని అనురాగ్ ఠాకూర్ చెప్పారు. అప్పటి వరకు క్యాబినెట్ సమావేశాలు జరగొచ్చని అన్నారు.
కేంద్ర క్యాబినెట్ నిర్ణయాలు
- రూ.8,399 కోట్ల వ్యయంతో ఢిల్లీ మెట్రో ఫేజ్-IV
- లజపత్ నగర్ నుంచి సాకేత్ జీ-బ్లాక్ ,ఇందర్లోక్ నుంచి ఇంద్రప్రస్థ వరకు రెండు కారిడార్లకు ఆమోదం
- లజపత్ నగర్ నుండి సాకేత్ జి-బ్లాక్ వరకు 8.385 కిలోమీటర్ల మేర ఉండనున్న మెట్రో లైన్
- సిల్వర్, మెజెంటా, పింక్ వైలెట్ లైన్లను కనెక్ట్ చేయనున్న లజపత్ నగర్ నుంచి సాకేత్ జీ-బ్లాక్ మెట్రో లైన్
- 8 కిలో మీటర్లలో ఎనిమిది స్టేషన్ల నిర్మాణం
- ఇందర్లోక్ నుంచి ఇంద్రప్రస్థ వరకు 12.377 కిలోమీటర్ల మేర ఉండనున్న మెట్రో లైన్
- 10 స్టేషన్లతో 11.349 కిలోమీటర్ల భూగర్భ లైన్లు, 1.028 కిలోమీటర్ల ఎలివేటెడ్ లైన్లు
- ఎరుపు, పసుపు, ఎయిర్పోర్ట్ లైన్, మెజెంటా, వైలెట్ బ్లూ లైన్లతో పరస్పర కనెక్టివిటీ అందించనున్న గ్రీన్ లైన్ మెట్రో
- హరియాణాలోని బహదూర్ఘర్ ప్రాంతానికి కనెక్టివిటీని అందించనున్న గ్రీన్ లైన్
Also Read: టీడీపీ రెండో జాబితా సిద్ధం.. గురువారం ప్రకటిస్తాం: చంద్రబాబు