ఫ్లాట్‌లో విద్యుత్ షాక్.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి

అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాఫ్తు చేపట్టారు.

ఫ్లాట్‌లో విద్యుత్ షాక్.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి

Current Shock (Photo Credit : Google)

Current Shock : హైదరాబాద్ సనత్ నగర్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కరెంట్ షాక్ ప్రాణాలు తీసింది. విద్యుత్ షాక్ తో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. సనత్ నగర్ జెక్ కాలనీలోని ఆకృతి రెసిడెన్సీ 2వ అంతస్తులోని ఫ్లాట్ నెంబర్ 204 లో ఈ ప్రమాదం జరిగింది. కరెంట్ షాక్ తో ముగ్గురు కుటుంబసభ్యులు చనిపోయారు. ఇంట్లోని బాత్ రూమ్ లో ముగ్గురి మృతదేహాలను కాలనీవాసులు గుర్తించారు. మృతులను ఆర్ వెంకటేశ్(55), మాధవి(50), హరి (30)లుగా గుర్తించారు. వెంకటేశ్ సిగ్నోడ్ కంపెనీలో సేల్స్ హెడ్ గా పని చేస్తున్నారు. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాఫ్తు చేపట్టారు.

ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు కరెంట్ షాక్ తో చనిపోవడం స్థానికంగా సంచలనం రేపింది. అసలేం జరిగింది? కరెంట్ షాక్ ఎలా తగిలింది? అనేది మిస్టరీగా మారింది. ఈ కేసుని పోలీసులు అన్ని కోణాల్లో విచారిస్తున్నారు. ప్రమాదవశాత్తు మరణించారా? మరో కారణం ఏదైనా ఉందా? అనే యాంగిల్ లో ఎంక్వైరీ చేస్తున్నారు.

Also Read : బాబోయ్.. పోలీసును కర్రతో దారుణంగా కొట్టాడు, ఒళ్లుగగుర్పొడిచే వీడియో..