IND v NEP: మహిళల ఆసియా కప్ 2024: నేపాల్పై భారత్ విజయ దుందుభి
మహిళల ఆసియా కప్ 2024 గ్రూప్ ఏ మ్యాచ్లో భారత్, నేపాల్ జట్లు తలపడ్డాయి.
![IND v NEP: మహిళల ఆసియా కప్ 2024: నేపాల్పై భారత్ విజయ దుందుభి IND v NEP: మహిళల ఆసియా కప్ 2024: నేపాల్పై భారత్ విజయ దుందుభి](https://10tv.in/wp-content/uploads/2024/07/India-vs-Nepal-Toss.jpg)
Womens Asia Cup 2024 India Women vs Nepal Women Match Live Updates (Photo: @BCCIWomen)
భారత్ గెలుపు
నేపాల్ మహిళల జట్టుపై భారత్ 82 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. భారత్ ఇచ్చిన 179 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో నేపాల్ రాణించలేకపోయింది. నిర్ణీత 20 ఓవర్లలో నేపాల్ 9 వికెట్ల నష్టానికి 96 పరుగులు మాత్రమే చేసింది. నేపాల్ జట్టులో సీతా రానా మగర్ 18, రుబినా ఛత్రీ 15, బిందు రవాల్ 17 మినహా ఎవరూ రాణించలేదు.
నేపాల్ టార్గెట్ 179
నేపాల్తో జరుగుతున్న టీ20 మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత మహిళల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు నష్టపోయి 178 పరుగులు చేసింది. నేపాల్ ముందు 179 పరుగుల లక్ష్యం ఉంచింది. షఫాలీ వర్మ 81, దయాళన్ హేమలత 47, సజీవన్ సజన 10, జెమిమా రోడ్రిగ్స్ 28, రిచా ఘోష్ 6 పరుగులు చేశారు.
షఫాలీ వర్మ అవుట్
133 పరుగుల వద్ద ఇండియా రెండో వికెట్ కోల్పోయింది. షఫాలీ వర్మ 48 బంతుల్లో 12 ఫోర్లు, సిక్సర్తో 81 పరుగులు చేసి అవుటయింది. భారత్ 18 ఓవర్లలో 154/2 స్కోరుతో ఆట కొనసాగిస్తోంది.
హేమలత అవుట్.. ఫస్ట్ వికెట్ డౌన్
122 పరుగుల వద్ద భారత్ తొలి వికెట్ కోల్పోయింది. దయాళన్ హేమలత 42 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సర్తో 47 పరుగులు చేసి అవుటయింది. భారత్ 15 ఓవర్లలో 131/1 స్కోరుతో ఆట కొనసాగిస్తోంది.
భారత్ 10 ఓవర్లలో 91/0
టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్న భారత్ 10 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 91 పరుగులు చేసింది. షఫాలీ వర్మ 54, దయాళన్ హేమలత, 33 పరుగులతో ఆడుతున్నారు.
షఫాలీ వర్మ హాఫ్ సెంచరీ
ఇండియా డాషింగ్ ఓపెనర్ షఫాలీ వర్మ హాఫ్ సెంచరీ చేసింది. 26 బంతుల్లో 8 ఫోర్లు, సిక్సర్తో హాఫ్ సెంచరీ సాధించింది. ఇంటర్నేషన్ టీ20ల్లో ఆమెకిది 10వ హాఫ్ సెంచరీ కావడం విశేషం.
10th T20I FIFTY for @TheShafaliVerma 👌👌
This has been a cracking knock so far from the #TeamIndia opener 💪
Follow The Match ▶️ https://t.co/PeRykFKG4n#WomensAsiaCup2024 | #ACC | #INDvNEP
📸 ACC pic.twitter.com/4naGhHjVRW
— BCCI Women (@BCCIWomen) July 23, 2024
టాస్ గెలిచిన భారత్
IND v NEP: మహిళల ఆసియా కప్ 2024లో భాగంగా ఈరోజు జరుగుతున్న టీ20 మ్యాచ్ లో భారత్, నేపాల్ జట్లు తలపడుతున్నాయి. రంగిరి దంబుల్లా అంతర్జాతీయ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన భారత మహిళల జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. స్మృతి మంధాన.. భారత జట్టుకు కెప్టెన్గా వ్యవహరిస్తోంది. రెండు వరుస విజయాలతో భారత్ గ్రూపు ఏలో అగ్రస్థానంలో కొనసాగుతున్న టీమిండియా ఈ మ్యాచ్లోనూ గెలిచి సత్తా చాటాలని భావిస్తోంది.
తుది జట్లు
భారత్
షఫాలీ వర్మ, స్మృతి మంధాన (కెప్టెన్), దయాళన్ హేమలత, జెమిమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ (వికెట్ కీపర్), దీప్తి శర్మ, సజన, రాధా యాదవ్, తనూజా కన్వర్, రేణుకా ఠాకూర్ సింగ్, అరుంధతీ రెడ్డి
నేపాల్
సంఝనా ఖడ్కా, సీతా రాణా మగర్, కబితా కున్వర్, ఇందు బర్మా(కెప్టెన్), డాలీ భట్టా, రుబీనా ఛెత్రీ, పూజ మహతో, కబితా జోషి, కాజల్ శ్రేష్ఠ(వికెట్ కీపర్), సబ్నమ్ రాయ్, బిందు రావల్
Also Read: ప్రేయసితో ఇంగ్లాండ్ వికెట్ కీపర్ నిశ్చితార్థం.. గడిచిన ఏడాదిలో నాలుగో మహిళా క్రికెట్ జంట..!