శ్రీశైలం డ్యామ్‌కు పోటెత్తిన వరద.. గేట్లు ఎత్తేందుకు సన్నాహాలు

ఇక శ్రీశైలం డ్యామ్ పూర్తి స్థాయి నీటిమట్టం 887 అడుగులు. అయితే ఇప్పటికే శ్రీశైలం డ్యామ్ ప్రస్తుత నీటిమట్టం 871.90 అడుగులకు చేరింది.

శ్రీశైలం డ్యామ్‌కు పోటెత్తిన వరద.. గేట్లు ఎత్తేందుకు సన్నాహాలు

Srisailam Dam : శ్రీశైలం డ్యామ్ కు వరద పోటెత్తింది. గంట గంటకు పెరుగుతున్న వరద ఉధృతితో నిండుకుండను తలపిస్తోంది శ్రీశైలం డ్యామ్. ఎల్లుండి శ్రీశైలం జలాశయం గేట్లు ఎత్తాలని అధికారులు నిర్ణయించారు. ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 4 లక్షల 69 వేల 522 క్యూసెక్కులు కాగా.. ఔట్ ఫ్లో 62 వేల 847 క్యూసెక్కులుగా ఉంది. ఇక శ్రీశైలం డ్యామ్ పూర్తి స్థాయి నీటిమట్టం 887 అడుగులు. అయితే ఇప్పటికే శ్రీశైలం డ్యామ్ ప్రస్తుత నీటిమట్టం 871.90 అడుగులకు చేరింది. ఇక కుడిగట్టు, ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.

ప్రాజెక్ట్ లోకి వరద ఉధృతి పెరుగుతూ ఉండటంతో గేట్లు ఎత్తేందుకు అధికారులు రెడీ అయ్యారు. ఎల్లుండి జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ద్వారా గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసేందుకు అధికారులు ఏర్పాట్లు సిద్ధం చేశారు. గేట్లు ఎత్తేందుకు నీటిపారుదల శాఖ అధికారులు నిర్ణయించినట్లు సమాచారం. జలశాయం రేడియల్ క్రష్ గేట్లు ఎత్తు దిగువున ఉన్న నాగార్జున సాగర్ కు నీటిని విడుదల చేయనున్నారు. ఎల్లుంటి ఉదయం 10 లేదా 11 గంటల సమయంలో క్రషర్ గేట్లు ఎత్తి నీటి దిగువకు తరలించే అవకాశం ఉంది. గతేడాది వర్షాభావ పరిస్థితుల వల్ల శ్రీశైలం డ్యామ్ క్రషర్ గేట్లు ఎత్తలేదు. ఈసారి దాదాపు 15, 20 రోజుల ముందే క్రషర్ గేట్లు ఎత్తే అవకాశం ఉంది.

Also Read : రెండో ప్రమాద హెచ్చరిక జారీ.. ధవళేవ్వరం బ్యారేజ్ దగ్గర గోదావరి ఉగ్రరూపం