తిరుమలలో మరోసారి నకిలీ దర్శన టికెట్ల కలకలం..

ఐదుగురిపై కేసు నమోదు చేసిన పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.

తిరుమలలో మరోసారి నకిలీ దర్శన టికెట్ల కలకలం..

Tirumala Fake Darshan Tickets : తిరుమలలో మరోసారి నకిలీ దర్శన టికెట్ల కలకలం రేగింది. ఏపీ టూరిజం ముసుగులో నకిలీ టికెట్లతో భక్తులకు దర్శనాలు కల్పిస్తున్న ముఠా గుట్టుని టీటీడీ అధికారులు రట్టు చేశారు. ప్రతిరోజు 30 నుంచి 40 మంది భక్తులకు ఏపీ టూరిజం కోటాలో దర్శనాలు కల్పిస్తున్నారు. చెన్నైకి చెందిన ట్రావెల్ ఏజెంట్, టీటీడీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, ఏపీ టూరిజం ఉద్యోగులు కలిసి ఈ దందా చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఐదుగురిపై కేసు నమోదు చేసిన పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. నకిలీ టికెట్ల ముసుగులో పెద్ద ఎత్తున దందా సాగినట్లు తెలుస్తోంది.