ఈరోజుల్లో న్యాయం కొందరికే..! కూటమి ప్రభుత్వంపై మండిపడ్డ జగన్

రాష్ట్రంలో దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. ఇంతకుముందు ఎప్పుడూ జరగలేదు. మన అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజూ దాడులను ప్రోత్సహించలేదు.

ఈరోజుల్లో న్యాయం కొందరికే..! కూటమి ప్రభుత్వంపై మండిపడ్డ జగన్

Ys Jagan Mohan Reddy : ఏపీలో లా అండ్ అర్డర్ అదుపు తప్పిందని మాజీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. ప్రభుత్వం మంచి పనులపై దృష్టి పెట్టడం లేదని విమర్శించారు. రెడ్ బుక్ లో పేర్లు పెట్టుకుని ఎవరిని తొక్కాలి, ఎవరిపై కేసు పెట్టాలి అని మాత్రమే ఆలోచన చేస్తున్నారని జగన్ ఆరోపించారు. రాష్ట్రంలో అరాచకాలు, విధ్వంసాలు చేస్తున్నారని కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు జగన్.

Also Read : వీఆర్ఎస్‌పై సీనియర్ ఐఏఎస్ యూటర్న్..! మళ్లీ సర్వీసులోకి తీసుకోవాలని ప్రభుత్వానికి విన్నపం..!

”ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులన్నీ మీకు తెలియనివి కావు. రాష్ట్రంలో దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. ఇంతకుముందు ఎప్పుడూ జరగలేదు. మన అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజూ దాడులను ప్రోత్సహించలేదు. న్యాయం, ధర్మం అందరికీ ఒక్కటే. న్యాయం, ధర్మం కాపాడేందుకు మనమంతా ఉండాలి అని ఆ రోజుల్లో మనం మాట్లాడితే.. ఈరోజు మాత్రం ఎలా ఉందంటే.. న్యాయం కొందరికి మాత్రమే అన్నట్లుగా తయారు చేశారు ఈరోజు వ్యవస్థలను. లా అండ్ ఆర్డర్ దిగజారిపోయింది. పైనున్న వాళ్లు రెడ్ బుక్ లు పెట్టుకుంటారు. అందులో ఎవరిని తొక్కాలి, ఎవరిని నాశనం చేయాలి, ఎవరి ఆస్తులు ధ్వంసం చేయాలి, ఎవరి మీద కేసులు పెట్టాలి అన్నది అందులో రాసుకున్నారు” అని జగన్ ఆరోపించారు.