Priyadarshi : గేమ్ ఛేంజర్, బలగం ఒకేసారి షూటింగ్స్ జరిగాయి.. అక్కడా ఇక్కడా చేసేవాడ్ని..
గేమ్ ఛేంజర్ సినిమా దిల్ రాజు నిర్మాణ సంస్థలో తెరకెక్కుతుంది. బలగం కూడా ఇదే నిర్మాణ సంస్థలో వచ్చింది.
Priyadarshi : ప్రియదర్శి ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తూనే హీరోగా కూడా వరుస సినిమాలు చేస్తున్నాడు. గత సంవత్సరం బలగం సినిమాతో తెలంగాణ బ్యాక్ డ్రాప్ కథతో వచ్చి మంచి హిట్ కొట్టాడు. ఆ సినిమా భారీ విజయం సాధించింది. అయితే బలగం షూటింగ్, గేమ్ ఛేంజర్ షూటింగ్ ఒకేసారి జరిగాయట. రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా అనౌన్స్ చేసి మూడేళ్లయింది ఇటీవలే ఈ సినిమా షూట్ పూర్తయింది.
గేమ్ ఛేంజర్ సినిమా దిల్ రాజు నిర్మాణ సంస్థలో తెరకెక్కుతుంది. బలగం కూడా ఇదే నిర్మాణ సంస్థలో వచ్చింది. ప్రియదర్శి గేమ్ ఛేంజర్ సినిమాలో కూడా నటించాడు. తాజాగా ప్రియదర్శి ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ప్రియదర్శి మాట్లాడుతూ.. గేమ్ ఛేంజర్, బలగం సినిమాల షూటింగ్స్ ఒకేసారి జరిగాయి. గేమ్ ఛేంజర్ షూట్ పూర్తిచేసొచ్చి మళ్ళీ వెంటనే బలగంలో చేసేవాడ్ని. రెండు వేరు వేరు ప్రపంచాలు. దిల్ రాజు నిర్మాణంలో ఇలా ఎప్పుడూ ఒక పెద్ద సినిమా, ఒక చిన్న సినిమా జరుగుతాయి అని అన్నారు.
Also Read : Vivek Athreya – Pawan Kalyan : గుంటూరులో పవన్ కళ్యాణ్ ‘గుడుంబా శంకర్’కి ఒక జాతరలా ఉండేది.. మ్యాడ్ ఫ్యాన్స్..
దీంతో బలగం సినిమా షూట్ చేసి రిలీజయి హిట్ కొట్టి సంవత్సరం అయిపోతుంది కానీ గేమ్ ఛేంజర్ ఇంకా ఎలాంటి అప్డేట్స్ లేకుండా షూటింగ్ నే మూడేళ్లు సాగదీశారు అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే బలగం చిన్న సినిమా కాబట్టి వెంటనే అయిపోయింది. గేమ్ ఛేంజర్ విషయంలో మాత్రం శంకర్ మధ్యలో బ్రేక్ ఇచ్చి భారతీయుడు 2 కోసం వెళ్ళాడు. ఇక గేమ్ ఛేంజర్ సినిమా క్రిస్మస్ కి వస్తుందని దిల్ రాజు ఇటీవల చెప్పారు. ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.