Bheemla Naik : ఏపీ సర్కార్‌‌పై ప్రకాశ్ రాజ్ హాట్ కామెంట్స్, బాక్సాపీస్ వద్ద కక్ష సాధింపులు ఏంటీ ?

#BheemlaNayak, #GovtofAndhrapradesh హ్యాష్ ట్యాగ్ తో చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. సృజన సాంకేతికత మేళవించిన సినిమా రంగంపై అధికార దుర్వినియోగం, అధిపత్య ధోరణి ఏమిటీ ? అంటూ నిలదీశారు.

Bheemla Naik : ఏపీ సర్కార్‌‌పై ప్రకాశ్ రాజ్ హాట్ కామెంట్స్, బాక్సాపీస్ వద్ద కక్ష సాధింపులు ఏంటీ ?

Prakash Raj

Prakash Raj Tweet : ప్రపంచ వ్యాప్తంగా భీమ్లా నాయక్ సినిమా రిలీజ్ అయి…బిగ్గెస్ట్ హిట్ సాధించింది. ప్రతి చోటా రికార్డు కలెక్షన్లతో దూసుకపోతోంది. కానీ.. ఏపీలో మాత్రం రాజకీయ రచ్చ కొనసాగుతోంది. సినిమా రిలీజ్ కంటే ముందుగానే.. ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం.. ఐదో షోకు అనుమతినివ్వకపోవడంపై పవన్ ఫ్యాన్స్, జనసేన కార్యకర్తలు తీవ్రంగా మండిపడుతున్నారు. ప్రభుత్వ ఆదేశాలతో కొన్ని చోట్ల థియేటర్లు మూసివేశారు. తక్కువ ధరలో సినిమాను ప్రదర్శించలేం అంటూ చేతులెత్తేశారు. దీంతో ఏపీలో ప్రభుత్వం వర్సెస్ భీమ్లా నాయక్ అన్నట్లుగా పరిస్థితి కనబడుతోంది.

Read More : Telangana : తెలంగాణలో ప్రశాంత్ కిశోర్.. పీకే టీం సర్వే

టికెట్ల ధరలు తక్కువగా ఉండడంతో కలెక్షన్లు తక్కువగా రికార్డవుతున్నాయి. ఈ విషయంలో మెగా బ్రదర్ నాగబాబు స్పందించిన సంగతి తెలిసిందే. సినీ ఇండస్ట్రీ విషయంలో తమ కుటుంబం నోరు విప్పుతున్నా.. పెద్దలు మాత్రం రెస్పాండ్ కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమవుతున్నాయి. భీమ్లా నాయక్ మూవీపై ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై స్పందిస్తున్నారు. తాజాగా… సినీ నటుడు ప్రకాశ్ రాజ్ రియాక్ట్ అయ్యారు. ట్విట్టర్ వేదికగా ఓ ట్వీట్ చేశారు. #BheemlaNayak, #GovtofAndhrapradesh హ్యాష్ ట్యాగ్ తో చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. సృజన సాంకేతికత మేళవించిన సినిమా రంగంపై అధికార దుర్వినియోగం, అధిపత్య ధోరణి ఏమిటీ ? అంటూ నిలదీశారు. చిత్ర పరిశ్రమను క్షోభపెడుతూ మేమే ప్రోత్సాహిస్తున్నామంటే నమ్మలా ? అంటూ ప్రశ్నించారు. ఏవైనా ఉంటే.. రాజకీయ క్షేత్రంలో చూసుకోవాలి..కక్ష సాధింపులు బాక్సాపీస్ దగ్గర ఎందుకని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంతగా ఇబ్బంది పెట్టినా… ప్రేక్షకుల ఆదరాభిమానాలకు ఎవరూ అడ్డుకట్ట వేయలేరని ప్రకాశ్ రాజ్ ట్వీట్ లో వెల్లడించారు.

Read More : Prakash Raj : రాజ్యసభకు టీఆర్ఎస్ తరపున విలక్షణ నటుడు ప్రకాశ్‌రాజ్‌?

ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి, ఇతర నటులు సీఎం జగన్ కలిసి సినీ సమస్యలను ప్రస్తావించిన సంగతి తెలిసిందే. ఓ నివేదిక అందిన తర్వాత.. జీవో జారీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అనంతరం ఇండస్ట్రీ వారంతా సమన్వయం పాటించాలని చిరంజీవి చెప్పిన సంగతి తెలిసిందే. కానీ.. భీమ్లా నాయక్ సినిమా విషయంలో ఏపీ ప్రభుత్వం టార్గెట్ చేసిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రకాశ్ రాజ్ చేసిన ట్వీట్ పై ఏపీ ప్రభుత్వ పెద్దలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.