Andhra Pradesh : మూడు రాజధానులు, CRDA రద్దుపై హైకోర్టు తీర్పు

రైతులకు మూడు నెలల్లో ప్లాట్లు అభివృద్ధి చేసి ఇవ్వాలని, ఆరు నెలల్లో పూర్తి చేసి ఇవ్వాలని ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చింది. పిటిషన్ దారులకు ఒకొక్కరికి 50వేలు చొప్పున ఇవ్వాలని...

Andhra Pradesh : మూడు రాజధానులు, CRDA రద్దుపై హైకోర్టు తీర్పు

Ap High Court

AP 3 Capitals And CRDA Case : మూడు రాజధానులు, CRDA రద్దుపై ఏపీ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. దీనిపై దాఖలైన పిటిషన్లపై ఏపీ హైకోర్టు విచారిస్తున్న సంగతి తెలిసిందే. 2022, మార్చి 03వ తేదీ గురువారం తీర్పును ప్రకటించింది. ప్రభుత్వానికి శాసనాధికారం లేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. సీఆర్డీఏ చట్టం ప్రకారం న్యాయం చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. వివిధ పిటిషన్లపై వేర్వేరు తీర్పులు వెల్లడించింది. రైతులకు మూడు నెలల్లో ప్లాట్లు అభివృద్ధి చేసి ఇవ్వాలని, ఆరు నెలల్లో పూర్తి చేసి ఇవ్వాలని ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చింది. పిటిషన్ దారులకు ఒకొక్కరికి 50వేలు చొప్పున ఇవ్వాలని ప్రభుత్వానికి సూచించింది. ఈ అంశంలో రైతులు పిటిషన్ లు దాఖలు చేశారు.

Read More : Chandrababu : గ్రీజు కూడా వేయలేని ముఖ్యమంత్రి, మూడు రాజధానులు కడతాడా? చంద్రబాబు

హైకోర్టు ఆదేశాలు :-
సీఆర్డీఏ చట్ట ప్రకారమే రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించాలి.
ఒప్పందం ప్రకారం 6 నెలల్లో మాస్టర్ ప్లాన్ పూర్తి చేయాలి.
రైతులకు మూడు నెలల్లో ప్లాట్లు అభివృద్ధి చేసి ఇవ్వాలి.
అభివృద్ది పనులపై ఎప్పటికప్పుడు నివేదిక సమర్పించాలి.
రాజధాని కోసం తప్ప భూములను ఇతర అవసరాలకు ఉపయోగించకూడదు.
ఇతర అవసరాలకు భూములను తనఖా పెట్టడానికి వీల్లేదు.

ఏపీ రాజధాని విషయంలో అధికారంలోకి వచ్చిన సీఎం జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. విశాఖపట్టణం పరిపాలన, అమరావతి శాసన, కర్నూలును న్యాయ రాజధానులుగా పరిగణించనున్నారు. సెక్రటేరియట్, గవర్నర్ కార్యాలయం విశాఖపట్టణంలో ఏర్పాటవుతాయని, అసెంబ్లీ అమరావతిలో ఉంటుందని, హైకోర్టు కర్నూలులో ఏర్పాటు చేస్తామని గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై హైకోర్టులో పిటిషన్ లు దాఖలయ్యాయి. ఈ క్రమంలో.. ఇటీవలే జరిగిన ఏపీ అసెంబ్లీ సమావేశంలో సీఎం జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. విశాలమైన రీతిలో ప్రజల ప్రయోజనాలు కాపాడేందుకే 3 రాజధానుల బిల్లును వెనక్కు తీసుకుంటున్నామని సీఎం జగన్ చెప్పారు. మరింత మెరుగైన ప్రతిపాదనలతో సభ ముందుకు కొత్త బిల్లును తీసుకువస్తామని స్పష్టం చేశారు.

Read More : త్వరలో మూడు రాజధానులు కూడా వస్తాయి!

మూడు రాజధానులకు సంబంధించిన బిల్లుల్లోని ప్రభుత్వ సదుద్దేశాన్ని విపులంగా వివరించేందుకు, చట్టపరంగాగానీ, న్యాయపరంగా గానీ అన్ని సమాధానాలను బిల్లులోనే పొందుపరచేందుకు, బిల్లుల్ని మరింత మెరుగుపరిచేందుకు, అన్ని ప్రాంతాలకు, అందరికీ, విస్తృతంగా వివరించేందుకు ఇంకా ఏవైనా మార్పులు అవసరమైతే వాటిని కూడా పొందుపరిచేందుకు, ఇంతకుముందు ప్రవేశపెట్టిన బిల్లును ప్రభుత్వం వెనక్కి తీసుకుని, ఇంతకుముందు చెప్పిన అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుంటామన్నారు. మళ్లీ పూర్తి, సమగ్రమైన, మెరుగైన బిల్లుతో సభ ముందుకు వస్తుంది. విస్తృత, విశాల ప్రజా ప్రయోజనాలను కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నామని సీఎం జగన్ తెలిపారు. మరి హైకోర్టు తీర్పుపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.