Andhra pradesh : విశాఖలో క్రిస్టల్ రూపంలో విద్యార్ధులకు డ్రగ్స్ సరఫరా..ముగ్గురు అరెస్ట్

ఇప్పటి వరకు ఎన్నో రకాల మాదక ద్రవ్యాల గురించి అందరు వినే ఉంటారు. కానీ విశాఖలో అంతకు మించి డ్రగ్స్ లభ్యమైంది.

Andhra pradesh : విశాఖలో క్రిస్టల్ రూపంలో విద్యార్ధులకు డ్రగ్స్ సరఫరా..ముగ్గురు అరెస్ట్

Supply Of Drugs In Crystalline Form In Visakhapatnam (1)

Andhra pradesh : ఇప్పటి వరకు ఎన్నో రకాల మాదక ద్రవ్యాల గురించి అందరు వినే ఉంటారు. కానీ విశాఖలో అంతకు మించి డ్రగ్స్ లభ్యమైంది.యువతను టార్గెట్ చేసిన డ్రగ్స్ ముఠా ఆగడాలు శృతి మించుతున్నాయి. చదువుకోవటానికి వెళ్లిన విద్యార్ధులకు డ్రగ్స్ ముఠా మత్తు పాఠాలు నేర్పుతున్నారు. సాగర తీర ప్రాంతాల్లో క్రిస్టల్ రూపంలో డ్రగ్స్ దందా నడుస్తోంది. శిశాఖలో విద్యార్ధులకు డ్రగ్స్ సరఫరా చేస్తోంది డ్రగ్స్ ముఠా.స్పటిక రూపంలో డ్రగ్స్ దందా సాగుతోంది.

విశాఖపట్టణం జిల్లాలోని విద్యార్ధులు డ్రగ్స దందా నిర్వహిస్తున్నారు. బెంగళూరు నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి విద్యార్ధులు విక్రయిస్తున్నారు. ఈ విషయమై కచ్చితమైన సమాచారం ఆధారంగా పోలీసులు డ్రగ్స్ విక్రయిస్తున్న ముగ్గురిని బుధవారం (ఏప్రిల్ 13,2022) అరెస్ట్ చేశారు.

స్పటిక రూపంలో ఎండీఎంఏను అక్రమంగా రవాణా చేస్తున్నారు. 54 గ్రాముల డ్రగ్స్ స్వాధీనం క్రిస్టల్ రూపంలో ముగ్గురు నిందితులు సరఫరా చేస్తున్న సమయంలో పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. పోలీసులు అరెస్ట్ చేసిన ముగ్గురు నిందితులతో ఎవరెవరితో సంబంధాలున్నాయనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు. నగర శివారులో డ్రగ్స్ సరఫరా చేస్తున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. గత మూడు మాసాల క్రితం డ్రగ్స్ కేసులో అరెస్టైన వారికి ప్రస్తుతం అరెస్టైన వారికి ఏమైనా సంబంధాలున్నాయా అనే కోణంలో కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. గతంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో డ్రగ్స్ తీసుకొస్తూ విశాఖలో నిందితులు పట్టుబడ్డారు

విశాఖ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతం నుండి తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని పలు ప్రాంతాలకు గంజాయిని సరఫరా చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ తరుణంలో డ్రగ్స్ పట్టుబడడం కలకలం రేపుతుంది. ఈ ఏడాది జనవరిలో విశాఖలో ఎన్‌ఏడీ జంక్షన్ వద్ద టాస్క్‌ఫోర్స్ పోలీసులు, ఎయిర్ పోర్ట్ జోన్ పోలీసులు సంయుక్తంగా దాడి జరిపి డ్రగ్స్ సీజ్ చేశారు. ఈ కేసులో ఒక యువతిని, మరో యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందుతులు హైదరాబాద్‌కు,విశాఖకు చెందినవారిగా గుర్తించారు. వీరి వద్ద నుంచి టాబ్లెట్ల రూపంలో ఉన్న 18 పిల్స్, 2 ఎండిఎం పిల్స్ స్వాధీనం చేసుకున్నారు.

2021 నవంబర్ లో బెంగుళూరు నుండి కొకైన్ తీసుకొచ్చి విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. కాలేజీ విద్యార్ధులను లక్ష్యంగా చేసుకొని డ్రగ్స్ తె్తున్నారని పోలీసులు గుర్తించారు. ఓ రౌడీషీటర్ డ్రగ్స్ కేసులో కీలకంగా వ్యవహరించారని పోలీసులు చెబుతున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కాలంలో డ్రగ్స్ కేసులు అధికంగా నమోదవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా హైద్రాబాద్ కేంద్రంగా డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం డ్రగ్స్ సరఫరా చేసే వారిపై నిఘాను పెట్టింది. తెలంగాణ ప్రభుత్వం ఇటీవలనే నార్కోటిక్ వింగ్ ను ఏర్పాటు చేసింది.