Anil Kumar : దుబాయ్ లో చంద్రబాబు ముడుపులు తీసుకున్నారు.. అమరావతి అనేది పెద్ద భూ దందా : అనిల్ కుమార్

ఎన్నికలు ఎప్పుడు వచ్చినా, ఏ గంటకి వచ్చినా తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. మరోసారి జగన్ ను సీఎంను చెయ్యడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు.

Anil Kumar : దుబాయ్ లో చంద్రబాబు ముడుపులు తీసుకున్నారు.. అమరావతి అనేది పెద్ద భూ దందా : అనిల్ కుమార్

Anil Kumar (2)

Anil Kumar – Chandrababu : టీడీపీ అధినేత చంద్రబాబుపై మాజీ మంత్రి అనిల్ కుమార్ విమర్శలు చేశారు.  చంద్రబాబుకు ఇచ్చిన నోటీస్ వైసీపీ ఇచ్చింది కాదని కేంద్ర ప్రభుత్వ సంస్థ ఐటీ ఇచ్చిందని అన్నారు. చంద్రబాబుకు ఇచ్చిన నోటీసుపై బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి స్పందన లేదని, నోరు మెదపలేదని బంధు ప్రీతా అని ప్రశ్నించారు.

ఊరు ఊరు తిరుగుతున్న లోకేష్ కూడా ఉప్పు నిప్పు అంటాడు.. మరి ఈ నోటీస్ లు కనిపించలేదా అని నిలదీశాడు. దుబాయ్ లో కూడా చంద్రబాబు ముడుపులు తీసుకున్నారని ఆరోపించారు. అమరావతి ఒక బూటకం.. రైతులు ఈ విషయం గుర్తించాలన్నారు. అమరావతి అనేది పెద్ద భూ దందా.. రైతులు ఈ విషయం గుర్తు పెట్టుకోవాలని తెలిపారు.

YS Sharmila: షర్మిల కన్నా తుమ్మలనే బెస్ట్ అప్షన్.. తెలంగాణ కాంగ్రెస్ లో మారిపోతున్న సమీకరణాలు!

చంద్రబాబు ముడుపులపై పవన్ కళ్యాణ్ స్పందించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబుతో ప్యాకేజీ మాట్లాడుకోలేదంటే పవన్ దీనిపై మాట్లాడాలన్నారు. టీడీపీతో కాదు.. బీజేపీతో ఉన్నానని నిరూపించుకోవాలని సవాల్ చేశారు. రూ.118 కోట్లకు చంద్రబాబు లెక్క చెప్పాలని, ఐటీ నాలుగు నోటీసులు ఇచ్చినా స్పందన లేదన్నారు.

చంద్రబాబు తీసుకున్న లంచానికి ఆయన వివరణ ఇవ్వాలని అడుగుతున్నామని పేర్కొన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా, ఏ గంటకి వచ్చినా తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. మరోసారి జగన్ ను సీఎంను చెయ్యడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా వాటిని కలిపి సమాధి కట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.