AP : బాబుకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఫోన్

టీడీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఫోన్ చేశారు.

AP : బాబుకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఫోన్

Babu And Sha

Amit Shah And Chandrababu Naidu : టీడీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఫోన్ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో డ్రగ్స్ వ్యవహారం, పార్టీ ఆఫీసుపై వైసీపీ నేతల దాడిని ఫోన్ లో అమీత్ షాకు వివరించారు బాబు. వైసీపీ ప్రభుత్వంపై ఫిర్యాదు చేశారు. జమ్మూ కాశ్మీర్ పర్యటనలో ఉన్న షా…2021, అక్టోబర్ 26వ తేదీ మంగళవారం ఢిల్లీకి వచ్చారు. అమిత్ షా బిజీ షెడ్యూల్ కారణంగా…షాను బాబు కలువలేకపోయారనే సంగతి తెలిసిందే.

Read More : Crazy Business : వాడేసిన అండర్ వేర్లు అమ్ముతున్న ఎయిర్ హోస్టెస్..లక్షల్లో సంపాదన

ఏపీలో డ్రగ్స్ విషయంలో అధికారపక్షంపై టీడీపీ నేతలు పలు విమర్శలు గుప్పిస్తున్నారనే సంగతి తెలిసిందే. ఏపీ సీఎం జగన్ ను అసభ్యంగా దూషించారంటూ…టీడీపీ నేత పట్టాభి ఇంటిపై, టీడీపీ కార్యాలయాలపై వైసీపీ దాడులు చేయడంతో రాష్ట్రంలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటనలను టీడీపీ సీరియస్ గా తీసుకుంది. రాష్ట్రపతి, కేంద్ర పెద్దలను కలిసి…ఫిర్యాదు చేయాలని బాబు నిర్ణయించుకుని..ఢిల్లీకి వెళ్లారు. బాబుతో పాటు కొంతమంది టీడీపీ నేతలు కూడా ఉన్నారు. రాష్ట్రపతిని కలిసి ఏపీలో జరుగుతున్న పరిణామాలు, వైసీపీ ప్రభుత్వంపై ఫిర్యాదు చేశారు. అనంతరం ప్రధాన మంత్రి మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా అపాయింట్ మెంట్ ల కోసం ప్రయత్నించారు.

Read More : Patna Blasts : మోదీ ర్యాలీలో బాంబు పేలుళ్ల కేసులో దోషులుగా 9మంది

కానీ వారు బిజీగా ఉండడంతో బాబు తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. ఈ క్రమంలో…బాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. ఢిల్లీ వెళ్లిన చంద్ర‌బాబు బృందానికి ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర‌ మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా అపాయింట్ మెంట్లు ఇవ్వకపోవడంపై చుర‌క‌లంటించారు విజయసాయి రెడ్డి. చంద్రబాబును జాతీయ మీడియా కూడా ప‌ట్టించుకోవ‌ట్లేద‌ని ఎద్దేవా చేశారు విజయసాయిరెడ్డి. ఈ క్రమంలో..బాబుకు షా ఫోన్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.