AP Cabinet : నేడు ఏపీ మంత్రివర్గం సమావేశం.. 32 అంశాలతో కేబినెట్ అజెండా..!
ఏపీ కేబినెట్ మళ్లీ భేటీ కానుంది. శుక్రవారం ఉదయం 11 గంటలకు ఏపీ మంత్రివర్గం సమావేశం కానుంది. పీఆర్సీ వేతన సవరణ, ఉద్యోగుల ఆందోళనలపై చర్చించే అవకాశం ఉంది.

AP Cabinet : ఏపీ కేబినెట్ మళ్లీ భేటీ కానుంది. శుక్రవారం (జనవరి 21) ఉదయం 11 గంటలకు ఏపీ మంత్రివర్గం సమావేశం కానుంది. పీఆర్సీ వేతన సవరణ, ఉద్యోగుల ఆందోళనలపై చర్చించే అవకాశం ఉంది. కరోనా థర్డ్ వేవ్, ఒమిక్రాన్ కట్టడి చర్యలపై కార్యాచరణపై చర్చించనున్నారు. మొత్తం 32 అంశాలతో కేబినెట్ అజెండా నిర్ణయించారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశమున్నట్టు కనిపిస్తోంది. రైతులకు విత్తన, ఎరువుల సరఫరా కోసం ఈ-విక్రయ కార్పొరేషన్ ఏర్పాటుపై కూడా మంత్రి వర్గం చర్చించే అవకాశం ఉంది. ఇంధన శాఖకు సంభందించి మరో రెండు అంశాలను చర్చించనున్నట్టు తెలుస్తోంది.
ఏపీలో ప్రధాన ఇష్యూగా మారిన సినిమా టికెట్ల ధరలు అంశంపై కూడ ఏపీ కేబినెట్ లో చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఉద్యోగులు చేస్తున్న ఆందోళనలపై మంత్రులు స్పందించారు. ఉద్యోగులు భావోద్వేగంతో నిర్ణయాలు తీసుకోవద్దంటూ విజ్ఞప్తి చేశారు మంత్రి పేర్ని నాని. ఎవరో చెప్పిన మాటలు విని సమ్మెకు వెళ్లొద్దని కోరారు. రాష్ట్రంలో వాస్తవ పరిస్థితుల్ని ఉద్యోగులు అర్థం చేసుకోవాలని సూచించారు. మరోసారి ఉద్యోగులు, ప్రభుత్వం కూర్చుని చర్చించుకుంటే సమస్యకు పరిష్కారం దొరుకుతుందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.
ఉద్యోగ సంఘాలతో మాట్లాడే ప్రభుత్వం జీవోలు ఇచ్చిందని పేర్కొన్నారు. ప్రతి అంశాన్ని సున్నితంగానే చూస్తామని, వ్యక్తిగతంగా తీసుకుని ఏ కార్యక్రమాలు చేయబోమని ఆయన స్పష్టం చేశారు. పీఆర్సీపై ఉద్యోగులు ఆందోళన చేయడం సరికాదన్నారు ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్.
సీఎం జగన్తో జరిగిన సమావేశంలో ఉద్యోగులు పీఆర్సీకి అంగీకరించారన్నారు. అప్పుడు అన్నింటికీ అంగీకరించి… ఇప్పుడు ఆందోళనలు చేయడమేంటని ప్రశ్నించారు. ఉద్యోగులు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకోవాలని ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్రెడ్డి సూచించారు. ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం కచ్చితంగా చర్చలు జరుపుతుందన్నారు.
Read Also : Police Dance : పోలీసుల సరదా.. ఉద్యోగానికే ఎసరు తెచ్చింది..!
- Minister Roja: జగన్ లాంటి సీఎం భూతద్దంలో వెతికినా దేశంలో ఎక్కడా కనిపించడు: మంత్రి రోజా
- దావోస్లో సీఎం జగన్ బిజీ బిజీ
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం…!
- Pawan Kalyan On PetrolPrices : దేశంలో ఏపీలోనే పెట్రో ధరలపై పన్నులు ఎక్కువ, తగ్గించాలని పవన్ కళ్యాణ్ డిమాండ్
- Dr BR Ambedkar : కోనసీమ జిల్లా పేరు..డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా మార్పు
1Pn India Stars : RRR, KGF స్టార్లు ఏం చేస్తున్నారు??
2YV Subbareddy : శ్రీవారి దర్శనం కోసం భక్తులు రావొద్దని ఎప్పుడూ చెప్పలేదు : టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి
3UN human rights: ఐరాస మానవ హక్కుల బృందం చైనాలో స్వేచ్ఛగా పర్యటించలేదు: అమెరికా
4Kedarnath: కేదార్నాథ్లో పేరుకుపోతున్న చెత్త.. మోదీ ఏమన్నారంటే
5Nepal plane: నేపాల్లో విమానం అదృశ్యం.. ప్రయాణికుల్లో భారతీయులు
6Major : బాలీవుడ్, మలయాళం వాళ్ళు అడిగినా ఒప్పుకోలేదు.. మాకు ఓకే చేశారు..
7pani puri: పానీ పూరీ తిని 97 మంది పిల్లలకు అస్వస్థత
8Elon Musk vs Bhavish: ఎలన్ మస్క్ కు అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన ఓలా సీఈవో
9Tragedy : పెళ్ళిరోజే భార్య, ఇద్దరు పిల్లలను చంపి వ్యక్తి సూసైడ్..అప్పుల బాధ తాళలేక
10masked Aadhaar card: ఆధార్ కాదు.. మాస్క్డ్ ఆధార్ ఇవ్వండి
-
Thirumala : రికార్డు స్థాయిలో శ్రీవారిని దర్శించుకున్న 89వేల 318 భక్తులు..కరోనా లాక్డౌన్ అనంతరం తొలిసారి
-
Strange Incident : భార్యతో శృంగారంలో పాల్గొన్న 10 నిమిషాలకే మతిమరుపు..ఐర్లాండ్ లో విచిత్ర సంఘటన
-
Monkeypox : మంకీపాక్స్ను గుర్తించేందుకు ఆర్టీ-పీసీఆర్ కిట్
-
Rajasthan : బావిలో దూకి ఇద్దరు పిల్లలతోపాటు ముగ్గురు అక్కాచెల్లెళ్లు సూసైడ్..మహిళల్లో ఇద్దరు గర్భిణులు
-
Hyderabad : ఉద్యోగులకు HRA పెంపు
-
Rain Forecast : మూడు రోజుల్లో తెలంగాణలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు
-
Thirumala : తిరుమలలో మూడు రోజులపాటు బ్రేక్ దర్శనాలు రద్దు
-
NBK108: బాలయ్య కోసం సీనియర్ హీరోయిన్..?