MLC Election Results 2023: ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ హవా..‘జైలు నుండి వచ్చిన సైకోల పాలనకు చరమగీతం’ అంటూ అశోక్ గజపతిరాజు వ్యాఖ్యలు
ఏపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ హవా కొనసాగుతోంది. దీంతో టీడీపీ నేతలు సంబరాల్లో మునిగితేలుతున్నారు. అశోక్ గజపతిరాజు బంగ్లాలో టీడీపీ నేతలు గెంతులు వేస్తు సంబరాలు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా అశోక్ జగపతిరాజు మాట్లాుడతూ.. జైలు నుండి వచ్చిన సైకోల పాలనకు చరమగీతం అంటూ వ్యాఖ్యానించారు.
MLC Election Results 2023: ఆంధ్రప్రదేశ్ లోని పట్టభద్రులు(గ్రాడ్యుయేట్), ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. అటు ఉత్తరాంధ్ర, ఇటు తూర్పు రాయలసీమల్లో టీడీపీ హవా కొనసాగుతోంది. టీడీపీ అభ్యర్థులు విజయం దిశగా దూసుకుపోతున్నారు. దీంతో వైసీపీ ప్రభుత్వంపై వ్యతికేతక మొదలైందని…టీడీపీ విజయదుంధుబి మొదలైంది అంటూ టీడీపీ నేతలు ఆనందోత్సాహాల్లో తేలిపోతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులకు భారీ అధక్యంతో దూసుకుపోతుండటంతో తమ్ముళ్లు సంబరాలు చేసుకుంటున్నారు.ముఖ్యంగా ఉత్తరాంధ్రాలోని విజయనగరంలోని అశోక్ బంగ్లాలో సంబరాల్లో మునిగితేలుతున్నారు టీడీపీ నేతలు.
ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఫలితాల్లో టీడీపీ అభ్యర్థికి భారీ ఆధిక్యం రావడంతో టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలు వేస్తోంది. పార్టీ కార్యాలయంలో టీడీపీ నేతలు మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు బంగ్లాకు టీడీపీ శ్రేణులు భారీగా చేరుకుంటున్నారు. బంగ్లాలో ఉత్సాహంతో గెంతులు వేస్తున్నారు టీడీపీ నేతలు, కార్యకర్తలు. ఈ సందర్బంగా అశోక్ గజపతిరాజు మాట్లాడుతూ..వైసీపీ ప్రభుత్వ జీతగాళ్ల కృషి ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎక్కడా ఫలించలేదని ప్రజలు టీడీపీవైపే ఉన్నారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో 175 గెలవాలని పదే పదే నేతలపై ఒత్తిడి చేస్తున్న జగన్ ఈ ఎమ్మెల్సీ ఎన్నికల బాధ్యలను మంత్రులకు ఇవ్వగా వైసీపీ అభ్యర్థులు ఓడిపోవటంతో మరి జగన్ మంత్రులపై ఎటువంటి చర్యలు తీసుకుంటారో చూడాలి అన్నారు. బడ్జెట్ లో ఒట్టి అంకెల గారడి తప్ప ఏమీలేదంటూ అశోక్ గజపతిరాజు తీసిపారేశారు.
CM Jagan-Nara Lokesh : జగన్ ఢిల్లీ టూర్.. ‘ఆ మూడు పాయింట్ల’తో నారా లోకేశ్ సెటైర్లు
ప్రజల్లో చైతన్యం వచ్చి మార్పు ఆలోచన వస్తే ఇటువంటి సైకోలు, జైలు నుండి వచ్చిన వారు పాలనలో ఉండలేని ఇక టీడీపీ దూకుడులో వైసీపీ కొట్టుకుపోవటం ఖాయమన్నారు. ఈ ఎమ్మెల్సీ ఫలితాల చూసి అయినా మూర్ఖపు పాలకు బుద్ధి తెచ్చుకొని మారాలని కోరుకుంటున్నానన్నారు.ప్రజల కోస నిర్మించిన ప్రజా వేదికను కూల్చిన వైసీపీ ప్రభుత్వం….అదే టీడీపీ ప్రభుత్వం నిర్మించిన అసెంబ్లీని ఎందుకు కూల్చలేకపోయింది..?అంటూ ప్రశ్నించారు. చిన్న గోతులను పెద్దగోతులు చేసిన వారు వైసీపీ పాలకులంటూ విమర్శలు సంధించిన అశోక్ గజపతిరాజు చట్టాలను చుట్టాలుగా మార్చుకుని ఇష్టారాజ్యంగా పాలిస్తుంటే ప్రజలు తిరగబడక తప్పదని..దానికి నిదర్శనమే ఈ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు అని అన్నారు.
MLC Election Results 2023 : పవన్ కళ్యాణ్ మాట నిజమైంది.. ఈ ఎన్నికలు శుభపరిణామం.. గంటా శ్రీనివాసరావు
జైలుకెళ్లొచ్చిన జగన్ చాలా గొప్పవాడని పొగిడేస్తున్న వైసీపీ నేతలు గాంధీ గారు కూడా దేశ స్వాతంత్ర్య కోసం జైలుకెళ్లారు.మరి గాంధీగారు జైలుకు వెళ్లటానికి ఆర్థిక నేరాలకు పాల్పడిన జగన్ జైలుకు వెళ్లటానికి ఏమైనా పోలిక ఉందా ? అంటూ ప్రశ్నించారు. కాబట్టి జైలుకు వెళ్లినవారంతా గొప్పవారన్నట్లుగా మాట్లాడటం వైసీపీ నేతల అవగాహనకు నిదర్శనమని ఇకనైనా ఇటువంటి స్వార్థ రాజకీయాలకు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. ఈ ఎన్నికల విజయం వచ్చే అసెంబ్లీ ఎన్నికల విజయానికి నాంది అంటూ ఇక టీడీపీ విజయం ఖాయం అంటూ ధీమా వ్యక్తంచేశారు టీడీపీ నేతల అశోక్ గజపతిరాజు.
Pawan Kalyan: కులాల మధ్య చిచ్చుపెట్టేలా కుట్రలు జరుగుతున్నాయ్.. ఆ ఉచ్చులో ఎవరూ పడొద్దు ..