AP Corona : ఏపీలో కరోనా తగ్గుముఖం.. కొత్తగా ఎన్ని కేసులంటే..

ఏపీలో కరోనా తగ్గుముఖం పట్టింది. కొత్త కేసుల సంఖ్య తగ్గింది. గడిచిన 24 గంటల వ్యవధిలో 28వేల 855 కరోనా పరీక్షలు చేయగా,

AP Corona : ఏపీలో కరోనా తగ్గుముఖం.. కొత్తగా ఎన్ని కేసులంటే..

Ap Corona Cases

AP Corona : ఏపీలో కరోనా తగ్గుముఖం పట్టింది. కొత్త కేసుల సంఖ్య తగ్గింది. గడిచిన 24 గంటల వ్యవధిలో 28వేల 855 కరోనా పరీక్షలు చేయగా, 246 మందికి కొవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. మరో నలుగురు కరోనాతో చనిపోయారు. కృష్ణా, గుంటూరు, కర్నూలు, విశాఖ జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. దీంతో కొవిడ్‌ బారినపడి చనిపోయిన వారి సంఖ్య 14,401కి చేరింది.

Whatsapp: ఫెంటాస్టిక్ ఫీచర్.. వాట్సప్‌లో మెసేజ్ ఎప్పుడైనా డిలీట్ చేసుకోవచ్చు

ఒక్కరోజు వ్యవధిలో 334 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,50,720 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం ఏపీలో 3వేల 366 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

తాజాగా నమోదైన కేసుల్లో అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 80 కొత్త కేసులు నమోదు కాగా, చిత్తూరు జిల్లాలో 41, గుంటూరు జిల్లాలో 31 కేసులు గుర్తించారు. కర్నూలు, విజయనగరం జిల్లాల్లో చెరో కేసు నమోదైంది. పశ్చిమ గోదావరి జిల్లాలో రెండు కేసులు వెలుగుచూశాయి. అనంతపురం జిల్లాలో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,68,487 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.