AP Corona News : ఏపీలో కొత్తగా 31 కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 10వేల 372 కరోనా పరీక్షలు నిర్వహించగా, 31మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది.(AP Corona News)

AP Corona News : ఏపీలో కొత్తగా 31 కరోనా కేసులు

Ap Corona

AP Corona News : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 10వేల 372 కరోనా పరీక్షలు నిర్వహించగా, 31మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. అత్యధికంగా అనంతపురం జిల్లాలో 11 కేసులు నమోదయ్యాయి. కర్నూలు, విజయనగరం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. ఒక్కరోజు వ్యవధిలో రాష్ట్రంలో ఎలాంటి కోవిడ్ మరణాలు సంభవించలేదు.

గడిచిన 24 గంటల వ్యవధిలో మరో 66 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ఇంకా 450 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. నేటివరకు రాష్ట్రంలో కోవిడ్ తో మరణించిన వారి సంఖ్య 14వేల 730. నేటివరకు రాష్ట్రంలో 23,19,328 పాజిటివ్ కేసులు నమోదవగా.. 23,04,148 మంది కోలుకున్నారు. నేటివరకు రాష్ట్రంలో 3,33,60,681 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ బుధవారం సాయంత్రం కరోనా బులెటిన్ విడుదల చేసింది. క్రితం రోజు రాష్ట్రంలో 10వేల 529 కరోనా పరీక్షలు నిర్వహించగా, 30 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది.(AP Corona News)

India Covid-19 : కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం..మార్చి 31 నుంచి దేశ వ్యాప్తంగా కొవిడ్ నిబందనలు పూర్తిగా ఎత్తివేత

అటు దేశంలోనూ కరోనా వ్యాప్తి అదుపులోనే ఉంది. కొన్ని రోజులుగా కొత్త కేసులు రెండు వేలకు దిగువనే నమోదవుతూ ఊరటనిస్తున్నాయి. మరణాలు కూడా స్వల్ప హెచ్చుతగ్గులతో 100లోపే వెలుగుచూస్తున్నాయి.

మంగళవారం 6.77 లక్షల మందికి నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 1,778 కొత్త కేసులొచ్చాయి. ముందురోజు కంటే కాస్త పెరిగాయి. 24 గంటల వ్యవధిలో 2వేల 542 మంది వైరస్‌ నుంచి కోలుకున్నారు. కొవిడ్ వ్యాప్తి అదుపులో ఉండటంతో బాధితుల సంఖ్య గణనీయంగా పడిపోతోంది. ప్రస్తుతం ఆ సంఖ్య 23,087కి తగ్గిపోవడంతో.. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల రేటు 0.05 శాతానికి క్షీణించింది.

ఇప్పటి వరకూ 4.30 కోట్ల మందికి కరోనా సోకగా..4.24 కోట్ల (98.75 శాతం) మంది కరోనాను జయించారు. 24 గంటల వ్యవధిలో మరో 62 మంది కోవిడ్ తో చనిపోయారు. నేటివరకు దేశంలో కరోనా మరణాల సంఖ్య 5.16 లక్షలు దాటింది. ఇక నిన్న 30.5 లక్షల మంది టీకా తీసుకున్నారు. ఇప్పటి వరకూ 181 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయినట్లు కేంద్రం తెలిపింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ బుధవారం కరోనా బులెటిన్ విడుదల చేసింది.

దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి అదుపులోకి వస్తోన్న నేపథ్యంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 31 నుంచి కొవిడ్‌ నిబంధనలను పూర్తిగా ఎత్తివేయాలని నిర్ణయించినట్లు వెల్లడించింది. అయితే మాస్క్‌ ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి నిబంధనలు కొనసాగుతాయని స్పష్టం చేసింది. ఈ మేరకు హోంశాఖ కార్యదర్శి అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సమాచారమిచ్చారు.

Covid Vaccine: భారత్ లో 12-18 ఏళ్ల వారికి అత్యవసర వినియోగనిమిత్తం నోవావాక్స్ కు డీజీసీఐ అనుమతి

దేశంలో కొవిడ్ విజృంభించడంతో దాదాపు రెండేళ్ల క్రితం వైరస్‌ వ్యాప్తి నియంత్రణ కోసం ఈ నిబంధనలను అమల్లోకి తెచ్చిన విషయం తెలిసిందే. కొవిడ్ కట్టడి కోసం 2020 మార్చి 24న విపత్తు నిర్వహణ చట్టం కింద తొలిసారిగా ఈ నిబంధనలతో కూడిన మార్గదర్శకాలను కేంద్రం జారీ చేసింది. ఆ తర్వాత కేసుల సంఖ్యను బట్టి పలుమార్లు వీటిలో మార్పులు, చేర్పులు చేసింది. అయితే, గత ఏడు వారాలుగా దేశంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే నిబంధనలను పూర్తిగా తొలగించాలని హోం మంత్రిత్వ శాఖ నిర్ణయించింది.