మరో అడ్వకేట్ పై దాడి, ఆయుధాలతో విచక్షణారహితంగా కొట్టారు

మరో అడ్వకేట్ పై దాడి, ఆయుధాలతో విచక్షణారహితంగా కొట్టారు

Attack on another Advocate : తెలంగాణలో లాయర్‌ వామన్‌రావు దంపతులపై దాడి ఘటన మర్చిపోకముందే… నెల్లూరులో అడ్వకేట్‌పై దాడి జరిగింది. నెల్లూరు బార్‌ అసోషియేషన్‌ సభ్యుడైన లాయర్‌ రమేష్‌పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఇంట్లోకి చొరబడి ఆయుధాలతో విచక్షణారహితంగా కొట్టారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ రమేష్‌ను జీజీహెచ్‌కు తరలించారు.

రమేష్‌కు, అతని సోదరులకు మధ్య కొంతకాలంగా ఆస్తి వివాదాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో తన అన్నలే తనపై దాడి చేయించారని ఆరోపించాడు బాధితుడు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదుచేశాడు. కేసు నమోదుచేసుకున్న బాలాజీనగర్‌ పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. నిందితులను త్వరలోనే అరెస్టు చేస్తామన్నారు. అయితే పోలీసులు..రాజకీయ నాయకుల ప్రలోభాలకు తలొగ్గి పట్టుకున్న నిందితులను వదిలేశారని బాధితుడు తరపు న్యాయవాది ఆరోపిస్తున్నారు.

మరోవైపు…తెలంగాణలో సంచలనం సృష్టించిన వామనరావు దంపతుల హత్య కేసులో కీలక విషయాలు బయటకు వచ్చాయి. పక్కా ప్లాన్‌ ప్రకారం ఈ హత్య జరిగినట్లు పోలీసులు తేల్చారు. కుంట శ్రీనివాన్‌, చిరంజీవిలు హత్య చేసినట్లు వారికి కుమార్‌, టీఆర్‌ఎస్‌ నేత పుట్ట మధు మేనల్లుడు బిట్టు శీనులు సాయం చేసినట్లు గుర్తించారు. హత్య ఎలా చేశారు…? పథకం ఎలా అమలు చేశారు…? ఆయుధాలను ఎక్కడ పారేశారు వంటి వివరాలను పోలీసులు గుర్తించారు.