AP BJP : నేడు విజయవాడలో బీజేపీ ప్రజాగ్రహ సభ

ఏపీలో బలం పెంచుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది బీజేపీ. ఈ నేపథ్యంలోనే గత కొంతకాలంగా వైకాపా ప్రభుత్వం తీసుకొచ్చిన పలు జీవోలను, నిర్ణయాలను వ్యతిరేకిస్తూ వస్తుంది.

AP BJP : నేడు విజయవాడలో బీజేపీ ప్రజాగ్రహ సభ

Ap Bjp

AP BJP : ఏపీలో బలం పెంచుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది బీజేపీ. ఈ నేపథ్యంలోనే గత కొంతకాలంగా ప్రభుత్వం తీసుకొచ్చిన పలు జీవోలను, నిర్ణయాలను వ్యతిరేకిస్తూ వస్తుంది. సినిమా టికెట్ల ఇష్యూతోపాటు, రాజధాని అమరావతి వ్యవహారంపై బీజేపీ నేతలు అనేక సార్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీడియా వేదికగా మాట్లాడారు. ఇక ఈ నేపథ్యంలోనే విజయవాడలో మంగళవారం ప్రజాగ్రహ సభ నిర్వహించ తలపెట్టింది. మంగళవారం మధ్యాహ్నం 1 గంట నుంచి 5 గంటల వరకు ఈ సభ జరగనుంది. ఇందుకోసం పార్టీ నేతలు ఏర్పాట్లు పూర్తి చేశారు.

చదవండి : BJP MP Varun Gandhi : పగలు భారీ ర్యాలీలు,రాత్రి కర్ఫ్యూలు..సొంత పార్టీపైనే వరుణ్ గాంధీ సెటైర్లు

రాజధాని అమరావతి విషయంతో పాటు, ప్రభుత్వం నిర్ణయాల వల్ల ప్రజలకు, రాష్ట్రానికి కలిగే నష్టాలను ఈ సభ ద్వారా వివరించాలని బీజేపీ భావిస్తోంది. వైకాపా పాలనను పది అంశాల ద్వారా ఎండగట్టేలా నేతల ప్రసంగాలు ఉంటాయని బీజేపీ వర్గాలు తెలిపాయి. ఇక ఈ సభకు మాజీ కేంద్రమంత్రి జవదేకర్ ముఖ్య అతిథిగా రానుండగా పార్టీ ఏపీ చీఫ్ సోము వీర్రాజు, జాతీయ ప్రధాన కార్యదర్శి పురందేశ్వరి, ఎంపీలు సుజనా, సీఎం రమేష్, టీజీ వెంకటేష్, జీవీఎల్ నరసింహారావుతోపాటు, బీజేపీ ముఖ్య నేతలు పాల్గొననున్నారు

చదవండి : BJP Leader: ‘మతం మారిన హిందువులను సొంత మతంలోకి తీసుకొస్తాం’