live-in relationship : చిన్నతనంలోనే భర్త మృతి-వేరోకరితో సహజీవనం….

భర్త చనిపోయి ఒంటరిగా ఉన్న వితంతుకు  ఫించన్ ఇప్పిస్తాననే నెపంతో దగ్గరయ్యాడో వ్యక్తి.  ఆమెతో సహజీవనం చేస్తూ సన్నిహితంగా మెలగసాగాడు.

live-in relationship : చిన్నతనంలోనే భర్త మృతి-వేరోకరితో సహజీవనం….

Illegal Affair Murder

live-in relationship :  భర్త చనిపోయి ఒంటరిగా ఉన్న వితంతుకు  ఫించన్ ఇప్పిస్తాననే నెపంతో దగ్గరయ్యాడో వ్యక్తి.  ఆమెతో సహజీవనం చేస్తూ సన్నిహితంగా మెలగసాగాడు. కొన్నాళ్లకు ఆమె అతడ్ని పట్టించు కోకపోవటంతో అనుమానంతో ప్రియురాలిని హత్యచేశాడు.

వివరాల్లోకి వెళితే పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డి గూడెం మండలం టెక్కినవారిగూడెంకు చెందిన శిరీష అనే యువతి(22) భర్త మంగరాజుతో కలిసి జీవిస్తోంది. 2020 వ సంవత్సరం ఆగస్టు నెలలో పాము కాటేయటంతో మంగరాజు మృతి చెందాడు. అప్పటి నుంచి ఆమె ఒంటరిగా జీవిస్తోంది.

కొబ్బరి తోటల్లో   రోజు కూలికి వెళ్లే పెదవేగి మండలం, నాగన్నగూడెంకు చెందిన జుజ్జువరపు సుబ్బారావు(29) టెక్కినవారిగూడెంలో   ఉండే శిరీష ఒంటరిగా ఉండటం గమనించాడు. అప్పటికే పెళ్లై పిల్లలు ఉన్న సుబ్బారావు కన్ను శిరీషపై పడింది. భర్త లేని శిరీషను పరిచయం చేసుకున్నాడు. మాయ మాటలతో ఆమెను లోబరుచుకున్నాడు.

వితంతు పించన్ ఇప్పిస్తాననే నెపంతో డిసెంబర్ 2020 నుంచి ఆమెతో సహజీవనం చేయసాగాడు. ఎన్నాళ్లైనా వితంతు  పించను ఇప్పించకపోగా  తనతో సన్నిహితంగా ఉండటంతో అనుమానం వచ్చిన శిరీష సుబ్బారావును దూరం పెట్టసాగింది. అతను   ఫోన్ చేసినా రిప్లై ఇవ్వకపోవటం.. అతనితో పరిచయాన్ని తగ్గించుకోసాగింది. ఈ క్రమంలో సుబ్బారావుకు శిరీషపై అనుమానం వచ్చింది.

శిరీష వేరే వ్యక్తికి దగ్గరయ్యిందేమోననే అనుమానం పెరగసాగింది. అనుమానం మరింత పెరిగి రెండు నెలల క్రితం శిరీషతో గొడవ పడ్డాడు. తనను కాదన్న శిరీషను అంతమొందించాలని సమయం కోసం ఎదురు చూడసాగాడు. ఈనెల 13న టెక్కిన వారిగూడెం వచ్చిన సుబ్బారావు శిరీష ఇంటికి వచ్చి ప్రేమగా మాట్లాడాడు. అనంతరం బయటకు వెళ్దామని చెప్పి ఆమెను బైక్ పై ఎక్కించుకుని ముందుగానే బుక్  చేసుకున్న జంగారెడ్డి గూడెంలోని వెంకటేశ్వర లాడ్జికి తీసుకువెళ్లాడు.

Also Read : Wife Extra Marital Affair : వివాహేతర సంబంధం-భార్యను చంపి మామకు ఫోన్ చేసి చెప్పిన అల్లుడు

అక్కడ ఆమెతో శారీరకంగా కలిసి, ముందుగా వేసుకున్న పధకం ప్రకారం ఆమె  మెడను తువ్వాలుతో బిగించి ఊపిరి  ఆడకుండా చేసి హత్యచేశాడు.  అనంతరం ఆమె శవాన్ని కాళ్లు చేతులు విరిచి గోనె సంచిలో కట్టేసాడు. లాడ్జి వెనుకవైపు మెట్లనుంచి కిందకు దించి కొబ్బరికాయల సంచి మాదిరిగా తన బైక్‌పై  కట్టుకున్నాడు.

పెదవేగి  మండలం లక్ష్మీపురం శివారులో  ఉన్న పోలవరం కాలువ గట్టు మట్టి దిబ్బలపైకి తీసుకువెళ్లి మూట విప్పి శిరీష మృతదేహాన్ని అక్కడ పడేసి పారిపోయాడు. అదే రోజు శవాన్ని చూసిన గ్రామస్తులు వీఆర్వోకు సమాచారం అందించారు. వీఆర్వో సమాచారం మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందుతుడిని 18వ తేదీనఅరెస్ట్ చేశారు.