Chandrababu : ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది.. జగన్‌కి ఇచ్చిన ఒక్క ఛాన్సే లాస్ట్ ఛాన్స్-చంద్రబాబు

వైసీపీ ఎమ్మెల్యేల పనితీరు, అవినీతిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని తెలిపారు. తల్లికి, చెల్లికి న్యాయం చెయ్యలేని సీఎం.. రాష్ట్రానికి ఏం న్యాయం చేస్తారు?

Chandrababu : ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది.. జగన్‌కి ఇచ్చిన ఒక్క ఛాన్సే లాస్ట్ ఛాన్స్-చంద్రబాబు

Chandrababu

Chandrababu : పార్టీ సీనియర్ నేతలతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆన్ లైన్ లో సమావేశం అయ్యారు. మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మృతికి చంద్రబాబు సహా నేతలు సంతాపం తెలిపారు. సీఎం జగన్ పై మరోసారి ఫైర్ అయ్యారు చంద్రబాబు. జగన్ కి ఇచ్చిన ఒక్క ఛాన్సే.. లాస్ట్ ఛాన్స్ అని చంద్రబాబు అన్నారు. వైసీపీ ఎమ్మెల్యేల పనితీరు, అవినీతిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని తెలిపారు. తల్లికి, చెల్లికి న్యాయం చెయ్యలేని వ్యక్తి.. ఇక రాష్ట్రానికి ఏం న్యాయం చేస్తారు? అని చంద్రబాబు ప్రశ్నించారు.

Botsa Satyanarayana: టీడీపీ నేతలపై మండిపడ్డ మంత్రి బొత్స సత్యనారాయణ

సీఎం జగన్ తన తల్లిని, చెల్లిని పక్క రాష్ట్రానికి తరిమేశారని చంద్రబాబు ఘాటు విమర్శలు చేశారు. మరో చెల్లి.. తన తండ్రి హత్య కేసు పరిష్కారానికి పోరాటం చేస్తోందని.. వైఎస్ వివేకానంద రెడ్డి కేసుని ఉద్దేశించి వాపోయారు. వైసీపీ నేతల రౌడీయిజం, సెటిల్ మెంట్లపై గట్టిగా పోరాడాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు చంద్రబాబు.

Nara Lokesh : పోలీసులని చూస్తే జాలితో కూడిన అసహ్యమేస్తోంది-నారా లోకేశ్

జగన్ దగ్గర డబ్బు, అధికారం ఉంటే… టీడీపీకి ప్రజాబలం ఉందన్నారు చంద్రబాబు. క్షేత్రస్థాయిలో పని చెయ్యని నాయకులను పార్టీ భరించాల్సిన అవసరం లేదని నేతలకు హెచ్చరికలు పంపారు చంద్రబాబు. త్వరలోనే ఆన్ లైన్ సభ్యత్వ నమోదు ప్రారంభించనున్నాం అని చంద్రబాబు తెలిపారు. టీడీపీ 40 ఏళ్ల ఆవిర్భావ వేడుకలు, ఎన్టీఆర్ 100వ జయంతి, మహానాడుకు ప్రాధాన్యం ఇస్తున్నాం అన్నారు.