Chandrababu: ఢిల్లీకి చంద్రబాబు.. కేంద్రమంత్రి అమిత్ షాతో భేటీ!

తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తూ విమర్శలు చేయడంపై వైసీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Chandrababu: ఢిల్లీకి చంద్రబాబు.. కేంద్రమంత్రి అమిత్ షాతో భేటీ!

Chandrababu (1)

Chandrababu: తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తూ విమర్శలు చేయడంపై వైసీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టాభి రామ్ ఇంటిపై దాడులు చేసి ఇంట్లోని వస్తువులను ధ్వంసం చేశారు. అదే విధంగా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలోకి దూసుకెళ్లి రాళ్లు, కర్రలతో దాడి చేశారు.

ఈ ఘటనపై తెలుగుదేశం పార్టీ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదే విషయమై ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు కేంద్ర మంత్రి అమిత్ షాకు ఫోన్ చేశారు. పక్కా ప్రణాళిక ప్రకారమే దాడులు వైసీపీ చేస్తున్నట్లు ఫోన్‌లో అమిత్ షాకు వివరించారు చంద్రబాబు. అయితే, దాడి విషయం ఇంకా తన దృష్టికి రాలేదని పార్టీ లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటామని అమిత్ షా హామీ ఇచ్చారు.

ఈ క్రమంలోనే చంద్రబాబు ఢిల్లీకి వెళ్తున్నారు. శనివారం ఢిల్లీకి వెళ్తున్న చంద్రబాబు.. హోంమంత్రి అమిత్ షా ని కలవనున్నారు. ఈమేరకు అమిత్ షా అపాయింట్మెంట్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. టీడీపీ కార్యాలయాలపై జరిగిన దాడులపై ఫిర్యాదు చేసేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారు.