Laxmi Parvathi: అన్‌స్టాపబుల్ -2లో ఎన్టీఆర్‌పై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. కౌంటర్ ఇచ్చిన లక్ష్మీపార్వతి

బాలకృష్ణ హోస్ట్‌గా ఆహాలో చేసిన అన్‌స్టాపబుల్‌-2 ప్రారంభ ఎపిషోడ్‌కు మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హాజరయ్యాడు. ఈ షోలో బాలకృష్ణ సంధించిన ప్రశ్నలకు చంద్రబాబు సమాధానాలిచ్చాడు. ఈ క్రమంలో సీనియర్ఎ న్టీఆర్‌ విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు వ్యాఖ్యలకు లక్ష్మీపార్వతి కౌంటర్ ఇచ్చారు.

Laxmi Parvathi: అన్‌స్టాపబుల్ -2లో ఎన్టీఆర్‌పై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. కౌంటర్ ఇచ్చిన లక్ష్మీపార్వతి

Laxmi parvathi

Laxmi Parvathi: బాలకృష్ణ హోస్ట్‌గా ఆహాలో చేసిన అన్‌స్టాపబుల్‌-2 ప్రారంభ ఎపిషోడ్‌కు మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హాజరయ్యాడు. ఈ షోలో బాలకృష్ణ సంధించిన ప్రశ్నలకు చంద్రబాబు సమాధానాలిచ్చాడు. ఈ క్రమంలో ఎన్టీఆర్‌తో కలిసి పనిచేసిన సమయంలో, ఎన్టీఆర్ ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయిన సమయంలో కీలక పరిణామాలను చంద్రబాబు వివరించారు. ఎన్టీఆర్ ఒక ఆశయం కోసం పార్టీ పెట్టి పోరాడి ముందుకెళ్లారని, ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అని చెప్పి పనిచేశామని అన్నారు.

Chandrababu Naidu : నేను చేసిన పెద్ద తప్పు అదే.. నా వల్ల వాళ్లంతా సఫర్ అయ్యారు..

1995 సంవత్సరంలో తీసుకున్న నిర్ణయం కీలకమైనదని, ఆ సమయంలో ఎమ్మెల్యేలు కొంతమంది ఎన్టీఆర్ నిర్ణయంపై రివర్స్ అయ్యారని చంద్రబాబు తెలిపారు. నేను, నువ్వు(బాలకృష్ణ), హరికృష్ణ, కొంతమంది ఎమ్మెల్యేలు ఎన్టీఆర్ దగ్గరకు వెళ్లాం. ఫ్యామిలీ అయితే మీ ముగ్గురు ఉండండి, రాజకీయం అయితే నన్నొక్కడ్నే ఉండమన్నారు. మీరు బయటకి వెళ్లిపోయారు. మూడు గంటలు ఎన్టీఆర్‌తో మాట్లాడాను. సమస్యలు చెప్పాను, మీటింగ్ పెట్టమన్నాను, అయన కళ్ళు పట్టుకున్నాను, కానీ వినలేదు అంటూ చంద్రబాబు చెప్పారు. ఎన్టీఆర్‌ది, నాది రామాంజనేయ యుద్ధమని, అయనకంటే అయన సిద్ధాంతాలు ముందుకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో ఆ రోజు మనం తీసుకున్న నిర్ణయం తప్పా అంటూ చంద్రబాబు బాలకృష్ణ‌ను ఉద్దేశించి అన్నాడు. ఎన్టీఆర్ నాకు ఆరాధ్యదైవమని, ఆయనకి నా మీద నమ్మకం ఉంది. ఇది చరిత్ర అంటూ చంద్రబాబు అన్నారు.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

చంద్రబాబు వ్యాఖ్యలకు స్పందించిన బాలకృష్ణ.. నందమూరి కుటుంబ సభ్యుడిగా, ఒక రాజకీయ నాయకుడిగా, అభిమానిగా చెప్తున్నా.. మీరు తీసుకున్న నిర్ణయం కరక్ట్ అంటూ చంద్రబాబుకు మద్దతుగా నిలిచారు. ఈ షో రాజకీయంగా సంచలనాలకు వేదికైంది. ఈ షోలో చంద్రబాబు, బాలకృష్ణ సంభాషణలపై వైసీపీ నేత లక్ష్మీపార్వతి స్పందించారు. చంద్రబాబు వ్యాఖ్యలపై ఘాటు విమర్శలు చేశారు. ఎన్టీఆర్ పై చంద్రబాబు కక్ష పెంచుకున్నాడని, ఎంత కక్ష లేకుంటే ఆయనపై చెప్పులేయిస్తారని అన్నారు. చంద్రబాబు అబద్దాల కోరని అందరికీ తెలుసు, ఎన్టీఆర్‌కు మరోసారి బాలకృష్ణ మోసం చేస్తున్నారని లక్ష్మీపార్వతి అన్నారు. బాలకృష్ణ కంటే చంద్రబాబు పెద్ద నటుడుగా మారాడని, పార్టీ ఆఫీస్‌లో ఎన్టీఆర్ ఫొటోలు తీసి బాత్ రూమ్‌లో వేసిన ఘటనలు చంద్రబాబు మర్చిపోయి ఉంటాడంటూ కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబుకు ఎన్టీఆర్ అంటే గౌరవం లేదని, దుర్మార్గుడంటూ లక్ష్మీపార్వతి ఘాటు విమర్శలు చేశారు. ఎన్నికల కంటే ముందే ఎన్టీఆర్‌పై చంద్రబాబు కుట్ర చేశారని, చెప్పులు వేయించి మరీ అవమానపర్చారని అన్నారు. చంద్రబాబు, బాలకృష్ణ చెప్పిన మాటలన్నీ అబద్దమేనంటూ లక్ష్మీపార్వతి అన్నారు.