Indrakeeladri : దుర్గగుడికి జగన్ రూ. 70 కోట్లు ఇచ్చారు..మిగతా సీఎంలు ఇచ్చారా ?

రాష్ట్ర విభజన తర్వాత వెంకన్న స్వామి, సింహాద్రి స్వామితో పాటు ఆధ్యాత్మిక దేవాలయాలే..ఇంక మరేమీ దక్కలేదు అంటూ...విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి కీలక వ్యాఖ్యలు చేశారు.

Indrakeeladri : దుర్గగుడికి జగన్ రూ. 70 కోట్లు ఇచ్చారు..మిగతా సీఎంలు ఇచ్చారా ?

Vishaka

Swaroopanandendra Saraswati : రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత మిగిలింది ఆధ్యాత్మికమే తప్ప ఇంకేమీ ఏపీ రాష్ట్రానికి దక్కలేదు…దుర్మార్గంగా రాష్ట్రాన్ని విడగొట్టారు..రాష్ట్రాన్ని రక్షించాలి..ఆర్ధికంగా ఎదగాలి..రాష్ట్ర విభజన తర్వాత వెంకన్న స్వామి, సింహాద్రి స్వామితో పాటు ఆధ్యాత్మిక దేవాలయాలే..ఇంక మరేమీ దక్కలేదు అంటూ…విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి కీలక వ్యాఖ్యలు చేశారు. దుర్గగుడి అభివృద్ధికి సీఎం జగన్ 70 కోట్లు ఇచ్చారని, గత‌ ముఖ్యమంత్రులెవరైనా దుర్గగుడికి నిధులిచ్చారా అంటూ ఆయన ప్రశ్నించారు.

Read More : Chandrababu : తిరుపతి వరద బాధితులకు తెలుగుదేశం కేడర్ అండగా నిలవాలి, ఇది ప్రభుత్వ వైఫల్యమే

దేవాలయాల బాగు కోసం విశాఖ శారదా పీఠం కంకణం కట్టుకుందని, మంత్రి వెల్లంపల్లి దేవాదాయ శాఖ మీద ఇంక శ్రద్ధ పెట్టాలని సూచించారు. అధికారులు రాజకీమాలరె వదిలేయాలన్నారు. 2021, నవంబర్ 18వ తేదీ గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఒకప్పుడు దేవాదాయ ధర్మాదాయ అంటే నీచమైన పరిపాలన ఉండేదని, ఇప్పుడు దేవాదాయ ధర్మాదాయ మంచి పాలన అందిస్తుందని కితాబిచ్చారు. దేవాలయ రక్షణ కోసం దేవాదాయ ధర్మాదాయ శాఖ తీరు, ‌అధికారులు మారి భక్తులకు చేరువలో ఉండాలన్నారు.

Read More : School Bus : చిత్తూరులో వరద నీటిలో చిక్కుకున్న స్కూల్ బస్.. తృటిలో తప్పిన ప్రమాదం

కార్తీక మాసం గురించి కూడా ఆయన మాట్లాడారు. కోటి దీపోత్సవంలో దీపారాధన చేయడం చాలా సంతోషదాయకమైనదిగా తెలిపారు. అమ్మవారి పాదాల చెంత కోటి దీపారాధన చేసిన అందరికి మంచి జరగాలని ఆకాక్షించారు. సనాతన హిందూ ధర్మంలో కులం, మతం, జాతి అనే బేధం లేకుండా ఇలాంటి కార్యక్రమాలు హిందూ సంప్రదాయంలోనే ఉన్నాయన్నారు. కనకదుర్గమ్మ దేవాలయం ఏపీలో ఉండడం ఇక్కడి వారి అదృష్టంగా అభివర్ణించారు. పసుపు కుంకుమతో అమ్మవారిని దర్శిస్తే కుటుంబాలు చల్లగా ఉంటాయని, పరమ శివుడికి అత్యంత ప్రీతి కార్తీక మాసమని తెలిపారు విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి.