AP corona : ఏపీలో పెరుగుతున్న కరోనా..24 గంటల్లో 984 కేసులు, గుంటూరులో 225 మందికి పాజిటివ్
ఏపీలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. గతంలో వందల్లో కేసులు నమోదవుతుంటే..ప్రస్తుతం ఆ సంఖ్య వేయికి చేరుకొంటోంది.
corona cases : ఏపీలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. గతంలో వందల్లో కేసులు నమోదవుతుంటే..ప్రస్తుతం ఆ సంఖ్య వేయికి చేరుకొంటోంది. గతంలో వందల కేసులుంటే..ఇప్పుడు వేయి కేసులు రికార్డువుతున్నాయి. గత సంవత్సర పరిస్థితి ఇప్పుడు కనిపిస్తోంది. గత 24 గంటల్లో కొత్తగా 1005 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారిన పడి చిత్తూరు, కృష్ణా జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. అత్యధికంగా గుంటూరులో 225, చిత్తూరులో 184, విశాఖపట్టణంలో 167 కరోనా కేసులు వెలుగు చూశాయి.
31 వేల 142 శాంపిల్స్ పరీక్షించగా..1005 మంది కోవిడ్ -19 పాజిటివ్ గా నిర్ధారింపబడ్డారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో 324 మంది కరోనా వైరస్ నుంచి కోలుకుని ఇంటికి వెళ్లారని వెల్లడించింది. నేటి వరకు రాష్ట్రంలో 1,49,90,039 శాంపిల్స్ పరీక్షించడం జరిగిందని తెలిపింది. రాష్ట్రంలో మొత్తం 8 లక్షల 95 వేల 920 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం 8 లక్షల 83 వేల 321 మంది డిశ్చార్జ్ అయ్యారు. మొత్తంగా..ఈ వైరస్ కారణంగా.. 7 వేల 205 మంది చనిపోయారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారి సంఖ్య 5 వేల 394గా ఉంది.
14వ తేదీ 298
15వ తేదీ 147
16వ తేదీ 261
17వ తేదీ 253
18వ తేదీ 218
19వ తేదీ 246
20వ తేదీ 380
21వ తేదీ 368
22వ తేదీ 310
23వ తేదీ 492
24వ తేదీ 585
25వ తేదీ 758
26వ తేదీ 984
27వ తేదీ 947
28వ తేదీ 1005
జిల్లాల వారీగా కేసులు : అనంతపురం 36. చిత్తూరు 487. ఈస్ట్ గోదావరి 25. గుంటూరు 225. వైఎస్ఆర్ కడప 21. కృష్ణా 135. కర్నూలు 42. నెల్లూరు 84. ప్రకాశం 35. శ్రీకాకుళం 22. విశాఖపట్టణం 167. విజయనగరం 13. వెస్ట్ గోదావరి 16. మొత్తం కేసులు : 1005
#COVIDUpdates: 28/03/2021, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 8,95,920 పాజిటివ్ కేసు లకు గాను
*8,83,321 మంది డిశ్చార్జ్ కాగా
*7,205 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 5,394#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/kUgfjCqs1t— ArogyaAndhra (@ArogyaAndhra) March 28, 2021