Covid : కుటుంబానికి రూ.50వేలు.. జగన్ ప్రభుత్వం ఉత్తర్వులు.. దరఖాస్తు ప్రక్రియ..
కరోనావైరస్ మహమ్మారి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేసింది. ఈ మహమ్మారి వల్ల ఎంతోమంది తమ ఆప్తులను కోల్పోయారు. ఇంటి పెద్దను కోల్పోయి అనేక కుటుంబాలు దిక్కు తోచని స్థితిలో ఉన్నాయి.
Covid : కరోనావైరస్ మహమ్మారి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేసింది. ఈ మహమ్మారి వల్ల ఎంతోమంది తమ ఆప్తులను కోల్పోయారు. ఇంటి పెద్దను కోల్పోయి అనేక కుటుంబాలు దిక్కు తోచని స్థితిలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కొవిడ్తో మరణించిన వారి కుటుంబాలను ఆదుకునేందుకు రూ.50 వేల చొప్పున సాయం అందించనుంది.
కేంద్రం ఆదేశాలతో రాష్ట్ర విపత్తు స్పందన నిధి (ఎస్డీఆర్ఎఫ్) నుంచి వీటిని మంజూరు చేయాలని కలెక్టర్లకు అనుమతిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా స్థాయిలో డీఆర్వో ఆధ్వర్యంలో ఓ సెల్ ఏర్పాటు చేసి, కొవిడ్ మృతుల కుటుంబీకుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. వీటిని పరిశీలించి కలెక్టర్కు సిఫార్సు చేశాక, రెండు వారాల్లో సాయం అందించనున్నారు. దరఖాస్తులో స్థానిక ఆశ కార్యకర్త, ఏఎన్ఎం, వైద్యాధికారి సంతకాలు కూడా అవసరమని ఉత్తర్వుల్లో తెలిపారు.
Petrol : లీటర్ కేవలం రూ.1.50.. ఆ దేశంలో అగ్గిపెట్టె కంటే పెట్రోల్ చీప్
దరఖాస్తు ప్రక్రియ..
* కొవిడ్ మరణం నిర్ధారించే కమిటీ సర్టిఫికెట్, మృతుల కుటుంబ సభ్యుల నుంచి వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ప్రతిపాదనలు పంపాలి
* కొవిడ్ మృతుల కుటుంబంలో వారి తర్వాత ఎవరైతే ఉంటారో వారికే ఈ నష్టపరిహారం చెల్లిస్తారు.
* దరఖాస్తులో పేరు, మృతుడితో బంధుత్వం, చనిపోయిన ప్రదేశం, దరఖాస్తుదారుడి చిరునామా, ఆధార్ నెంబరు, ఆధార్ లింక్ అయిన బ్యాంకు అకౌంట్, మరణ ధ్రువీకరణపత్రం, సీడీఏసీ ఆమోదించిన నెంబరుని ప్రభుత్వం విడుదల చేసిన దరఖాస్తు నమూనాలో నింపాలి.
* దరఖాస్తుతో పాటు స్థానిక రిజిస్ట్రార్ మంజూరు చేసిన మరణ ధ్రువీకరణపత్రం, సీడీఏసీ సర్టిఫికెట్, ఆధార్ జిరాక్స్, బ్యాంకు అకౌంట్ కాపీ, తహసీల్దారు జారీ చేసిన ఫ్యామిలీ మెంబరు సర్టిఫికెట్ కాపీలను జత చేయాలి.
* దరఖాస్తుపై ఆశ వర్కర్, ఏఎన్ఎం, మెడికల్ ఆఫీసర్ కౌంటర్ సంతకం చేయాల్సి ఉంటుంది. చివరిగా డీఆర్వో సంతకం చేసి ప్రతిపాదనలను పంపించాల్సి ఉంటుంది.
Turmeric : పసుపుతో క్యాన్సర్ చికిత్స సాధ్యమేనా!..